తిరుపతి ఉప ఎన్నికల్లో యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డుతున్నారని, లక్షలాది మందిని తీసుకు వచ్చి దొంగ ఓట్లు కూడా వేయిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామరాజు ధ్వజమెత్తారు. తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. దొంగఓట్లు వేయకపోయినా వైసీపీ అభ్యర్థి గెలుస్తారని, అలాంటప్పుడు వెదవ పనులు ఎందుకు చేస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దొంగఓట్లు వేస్తున్నా అధికారులు కూడా చూస్తూ ఉండిపోతున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయాన్ని బతికించాలని అనుకుంటే ఈసీ తిరుపతి పార్లమెంటుకు మరలా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే వైసీపీ గెలుపునకు అర్థం ఉండదన్నారు.
తిరుపతిలో ఎన్నికలు రద్దు చేయాలి..
తిరుపతి నగరంలో, శ్రీకాళహస్తిలో దాదాపు 150 పోలింగ్ బూతుల్లో దొంగఓట్లు ఎక్కువగా వేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామరాజు వెల్లడించారు. పోలీసులు కూడా చోధ్యం చూస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఎన్నిక రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
అవి ఉద్యోగాలనేనా..
నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఏ2 విశాఖలో వాలంటీర్లనుద్దేశించి చెప్పారని, సీఎం మాత్రం వాలంటీరు పోస్టులు ఉద్యోగాలు కాదని, ప్రజా సేవ మాత్రమేనని చెప్పారని… ఎవరు చెప్పింది నమ్మాలో అర్థం కావడం లేదని రఘురామరాజు ఎద్దేవా చేశారు. వాలంటీర్లను జగనన్న సైన్యం అని సమాచార శాఖా మంత్రి పేర్నినాన్ని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ సొమ్ముతో వాలంటీర్లకు జీతాలు ఇస్తూ మంత్రి పేర్నినాని వారిని జగనన్న సైన్యం అని ఎలా అంటారని ఎంపీ ప్రశ్నించారు.
Also Read:ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ.. అమిత్ షాకు టీడీపీ ఎంపీల ఫిర్యాదు











