గ్రహాంతర జీవుల విషయం ఇప్పటిదాకా ముసుగులో గుద్దులాటలా ఉంది. దీనిపై ఇక స్పష్టత వచ్చేసింది. గ్రహాంతర జీవుల నుంచి సిగ్నల్స్ వచ్చేశాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
రేడియో సిగ్నల్స్ విషయాన్ని బ్రిటీష్ వార్తా పత్రిక ‘ది గార్డియన్’ ద్వారా వెల్లడించింది. గ్రహాంతర వాసుల ఉనికి పై ఇప్పటిదాకా నాసాతోపాటు ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. వివిధ స్టేషన్ల నుంచి అంతరిక్షంలోకి రేడియో సిగ్నల్స్ పంపుతున్నారు. వాటికి సమాధానం వచ్చిందని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. నెదర్లాండ్ లోని రేడియో టెలీస్కోప్ ఫ్రీక్వెన్సీ నుంచి ఓ నక్షత్ర వ్యవస్థ నుంచి లభించిన సమాచారం ఆధారంగా వీటిని కనుగొన్నారు.
ఈ సిగ్నల్స్ మన సౌర కుటుంబానికి 51 కాంతి సంవత్సరాల దూరంలోని ఎక్సో గ్రహం నుంచి వచ్చినట్టు గుర్తించారు. అది కూడా మన భూమి లాంటి గ్రహమేనని, అక్కడ జీవరాశి ఉండి తీరుతుందని అంటున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విశ్వంలో మొట్టమొదటిసారిగా ఇంకో గ్రహం నుంచి రేడియో అయస్కాంత సిగ్నల్స్ కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
మన సూర్యుడి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారై. ఇక్కడి నుంచి చూస్తే మసక మసకగా కనిపిస్తుంది. ఇది మనకు 4.2 కాంతి సంవ్సరాల దూరంలో ఉంటుంది. మనకు రేడియో సిగ్నల్స్ వచ్చిన గ్రహం ఈ నక్షత్రం పరిధిలోనిదేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్కడ జీవం ఉంటే వారు మనకన్నా మహామేధావులని భావిస్తున్నారు. దీన్ని ఎక్స్ ట్రా టెరిస్ట్రియల్ ఇంటిలిజెన్స్ (ఇ.టి.ఐ) అంటున్నారు. దీన్నే టెక్నో సిగ్నేచర్ అని కూడా పిలుస్తారు. బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఆండ్రూ సిమియన్ మాట్లాడుతూ ఈ రేడియో తరంగాలు మన కన్నా చాలా శక్తిమంతంగా ఉన్నాయన్నారు.
ఇవి మన ఉపగ్రహాలు, స్పేస్ షిప్ ల మీద కూడా ఇవి ప్రభావం చూపగలవని అన్నారు. సిమియన్ ఆధ్వర్యంలో బ్రేక్ త్రూ లిజెన్ పేరుతో 100 మిలియన్ల ప్రాజెక్టు ద్వారానే ఈ సిగ్నల్స్ ను కనుగొన్నారు. ఈ నిధులను యూరి మిల్నర్ నిధులను సమకూర్చారు. 2015 నుంచి ఈ ప్రాజెక్టు గ్రహాంతర వాసుల కోసం అన్వేషిస్తోంది. దీన్ని సెటి (సెర్చ్ ఫర్ ఎక్స్ ట్రా టెరిస్ట్రియల్ ఇంటిలిజెన్స్) అంటున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి సిగ్నల్స్ ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు తీగ తగిలింది. దీన్ని లాగితే ఎలియన్స్ అనే డొంక కదలబోతోంది.
2016 లో కనుగొన్న గ్రహాన్ని ప్రాక్సిమా బి గా పిలుస్తున్నారు. ఇది మన భూమి కన్నా 1.2 రెట్లు పెద్దది. ఇది 11 రోజుల కక్ష్యలో ఉంటుంది. ఇది మానవ నివాసాలకు అనువుగా ఉంటుందని తెలుసుకున్నారు. ఇక్కడ నీరు కూడా ఉందట. భూమిలాంటి మరో గ్రహాన్ని కూడా అక్కడే కనుగొన్నారు. దీని ద్రవ్యరాశి భూమికన్నా భూమికన్నా ఏడు రెట్లు పెద్దది. దీన్ని ప్రాక్సిమా సి అంటున్నారు. 2019 లో 5.2 సంవత్సరాల కక్ష్యలో కనుగొన్నారు. ఈ బ్రేక్ త్రూ ప్రాజెక్టు పూర్తి వివరాలను వచ్చే ఏడాది వివరించనున్నారు.
Must Read ;- ఎలియన్స్ గురించి ట్రంప్ కు తెలుసా?
ఏలియన్స్ ఆచూకీ కోసం అతిపెద్ద టెలీస్కోప్
ఏలియన్స్ ఆచూకీని కనుగొనేందుకు చైనా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు అతిపెద్ద టెలీస్కోప్ ను ప్రారంభించింది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద టెలీస్కోప్ గా చెప్పాల్సి ఉంటుంది. ఇది 500 మీటర్ల సైజు ఉంటుంది. సన్నటి రంధ్రాలతో గోళాకారంలో దీన్నిరూపొందించారు. అంటే 30 ఫుట్ బాల్ మైదానాలంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. చైనాలోని స్కై ఐ అనే ప్రాంతంలో నిర్మించారు. 2016నుంచి ఇది పనిచేస్తోంది. దీని నుంచి కూడా ఏలియన్స్ కు సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉంది.
ఈ మోనోలిత్ లు ఎక్కడివి?
మన భూమి మీద మనకు తెలియకుండా ఏదేదో జరుగుతోందనిపిస్తోంది. ఎందుకంటే అనేక చోట్ల కొన్ని లోహ స్తంభాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ స్తంభాలను మోనోలిత్ అని వ్యవహరిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. వీటి ప్రయోజనం ఏమిటో కూడా మనకు అర్థం కావడం లేదు. ఇది గ్రహాంతర వాసులు చేస్తున్న పనేనన్న వాదన ఉంది. అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా దీన్ని కనుగొన్నారు. వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ సిబ్బందికి ముక్కోణపు ఆకారంలో ఉన్న స్తంభం కనిపించింది.
Also Read ;- గురు, శని కలయికే క్రిస్మస్ స్టారా?
అంతకుముందు లేని ఈ స్తంభం ఎలా వచ్చిందా అని వారు ఆశ్చర్యపోయారు. అంత బరువైన స్తంభం అక్కడికి ఎలా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత కాలిఫోర్నియాలో, రోమానియాలో కూడా ఇలాంటివే కనిపించాయి. ఈ డిసెంబరు 6వ తేదీన కూడా ఈ మోనోలిత్ లు ప్రత్యక్షమయ్యాయి. ఇంగ్లండ్ లోని ఐల్ ఆఫ్ వైట్ లో ఒకటి, ఫ్రైస్ ల్యాండ్ లో ఇంకోటి కనిపించాయి. ఇవి ఎలా వస్తున్నాయన్నది తేలితే దీని వెనక ఉన్న శక్తులేమిటన్నది తేలుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇది గ్రహాంతర వాసుల పనిగానే అనుమానిస్తున్నారు.
– హేమసుందర్ పామర్తి