బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ మూవీలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యు.వి. క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాథేశ్యామ్ చిత్రం 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే… వరుసగా పాన్ ఇండియా మూవీస్ ఎనౌన్స్ చేస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్ ఇటీవల సలార్ మూవీని ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమా కంటే ముందుగా ఓంరౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే… ఈ సినిమాల తర్వాత ప్రకటించినప్పటికీ.. ముందుగా స్టార్ట్ అయ్యేది.. ముందుగా రిలీజ్ అయ్యేది సలార్ మూవీనే. అందుకనే అనుకుంట.. సలార్ గురించే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది.
తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అది ఏంటంటే.. సలార్ అనే పదం ఉర్ధూ నుంచి తీసుకున్నానని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలియచేశారు. ఆయన స్వయంగా ఇలా చెప్పడం హాట్ టాపిక్ కి కారణం అయ్యింది.
మేటర్ ఏంటంటే.. సలార్ అనే టైటిల్ ను బట్టి ప్రభాస్ ఇందులో ముస్లిం లీడర్ గా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ టైటిల్ పెట్టారు అంటున్నారు. అయితే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మరిన్ని విషయాలు చెబుతాను అంటున్నారు కానీ.. ఇప్పుడు మాత్రం ఏమీ రివీల్ చేయడం లేదు. అయితే… టైటిల్ సలార్ అని పెట్టారు కానీ.. ప్రభాస్ ఇందులో ముస్లిం లీడర్ గా కనిపించడం లేదు అని సమాచారం. మరి.. ఎందుకు ఈ టైటిల్ పెట్టారు..? అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ఆది పురుష్ పై అసహనంతో ప్రభాస్ ఫ్యాన్స్