యంగ్ హీరో శర్వానంద్ కొంతకాలంగా.. వరుస పరాజయాల్ని చవిచూస్తున్నాడు. అందుకే తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్త గా అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శర్వా అగ్రికల్చరల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శ్రీకారం’ లో నటిస్తున్నాడు. కిషోర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు మలిచిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిక.
ఇక దీనికన్నా ముందే శర్వా నటించిన పేరు పెట్టని ఓ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో రీతూవర్మ కథానాయికగా నటించింది. ఇంకా శర్వా నటిస్తోన్న మరికొన్ని డిఫరెంట్ జోనర్ కలిగిన సినిమాలు ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
ఇక తాజాగా శర్వానంద్ ఓ మెడికల్ థ్రిల్లర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ శర్వానంద్ కు ఆ సినిమా కథను నెరేట్ చేశాడట. శర్వానంద్ దానికి బాగా ఇంప్రెస్ అయి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.
Must Read ;- ‘సాహో’ డైరెక్టర్ సుజిత్ నెక్ట్స్ మూవీ ఎవరితో ?