మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఆమధ్య కెరీర్ కాస్త వెనకబడినా.. ‘చిత్రలహరి’ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు. ఆతర్వాత ‘ప్రతిరోజు పండగే’ సినిమాతో సూపర్ సక్సస్ సాధించాడు. ఇక రీసెంట్ గా ‘సోలో బ్రతుకే సో బెటరు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా తర్వాత రిలీజైన ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాతో యూత్ ని బాగా ఆకట్టుకుని సక్సస్ సాధించాడు. ఇప్పుడు దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ మూవీలో ధరమ్ తేజ్ యువ ఐఏఎస్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ మొదటిసారి జోడీ కట్టింది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ మూవీకి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పెట్టనున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగానే.. ఈ మూవీ టైటిల్ ‘రిపబ్లిక్’ ని ఖాయం చేస్తూ దర్శక, నిర్మాతలు ఈ సాయంత్రం ట్డిట్టర్ వేదిక గా అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
సాయిధరమ్ తేజ్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందుతోన్న సినిమా ఇది. శ్రీ బాలాజీ సినీ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందు ప్లాన్ చేస్తుంది. దేవా కట్టా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఒక సామాజిక సందేశం కలిగిన ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. మరి.. ‘చిత్రలహరి, ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటరు’ చిత్రాలతో వరుసగా విజయాలు సాధిస్తూ ఫామ్ లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో కూడా సక్సస్ సాధిస్తాడేమో చూడాలి.
Must Read ;- సుకుమార్ బ్యానర్ లో సాయితేజ్.
And "REPUBLIC""రిపబ్లిక్" it is..
Here's the Motion poster of Supreme Hero @IamSaiDharamTej & @devakatta's #Republic ▶️ https://t.co/KhXlKiebQF#SDT14 #RepublicMotionPoster@aishu_dil @IamJagguBhai @meramyakrishnan #ManiSharma @bkrsatish @Cinemainmygenes @JBEnt_Offl @ZeeStudios_— deva katta (@devakatta) January 25, 2021