గ్రేటర్ ఎన్నికలతో హైదరాబాద్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. తమ పార్టీల గెలుపు కోసం ఆయా పార్టీలు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు పోతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచే దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి జాబితాలో 105 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ఈరోజు మరో 20 మందితో సెకెండ్ లిస్టును ప్రకటించింది. దీంతో మొత్తం 125 మంది అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ఖరారు చేసనట్లయింది. గ్రేటర్ ఎన్నికల్లో 100 సీట్ల కంటే తక్కువ కాకుండా గెలుపొందేందుకు గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే టీఆర్ఎస్ బరిలోకి దింపుతున్నది. ఈ క్రమంలోనే రెండవ లిస్టులో పాతవారైన ఆరుగురిని పక్కనబెట్టింది. బీజేపీని అడ్డుకునేందుకే ఈ విధమైన వడపోతలను టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
టార్గెట్ కిషన్ రెడ్డి, రాజాసింగ్…
నగరంలో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం ఎంపీగా కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అంబర్పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అంబర్పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్ నియజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇందులో అంబర్పేట నియోజకవర్గాన్ని కిషన్రెడ్డి ఇలాఖాగా చెప్పుకుంటారు. అయితే అంబర్పేటతో పాటు మిగతా చోట్ల బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలపై టీఆర్ఎస్ పార్టసీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా టీఆర్ఎస్ పార్టీ సరికొత్త ఎత్తుగడలతో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Must Read ;- బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదురుతోంది!
ప్రధానంగా అంబర్ పేట నుంచి ఐదు డివిజన్లలో గులాబీ జెండాను ఎగురవేసేందుకు టీఆర్ఎస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అంబర్పేట నియోజకవర్గ అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించే విషయం వెనుకాల అసలు కారణమిదేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని ప్రకటించడం వెనుకాల కూడా ఈ రకమైన వ్యూహమే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో మెజారిటీ సీట్లల్లో కారు స్పీడును పెంచాలని భావిస్తోంది. అందుకే ఈ నియోజకవర్గాల్లో ప్రజల్లో పట్టున్న నాయకులను దింపుతోంది. బీజేపీకి కూడా ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులు ఉండడంతో టీఆర్ఎస్కు మరింత తలనొప్పిగా మారింది. అందుకే అభ్యర్థుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటు నగరంలో బీజేపీకి బలమైన మరో స్థానం గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానంపైన కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. బీజేపీ వాయిస్ ను బలంగా వినిపించే నేతల్లో రాజాసింగ్ ముందు వరుసలోనే ఉంటారు. ఇక్కడ కూడా కాషాయ పార్టీకి చెక్ పెట్టేందుకు గాలాబీ పార్టీ వ్యూహాలను అమలు పరుస్తూ ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ పార్టీకి ధీటుగానే బీజేపీ పార్టీ సైతం ఎత్తుకు పైఎత్తులు వేస్తే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు పోతున్నది.
Also Read ;- సొంత గూటిలో శత్రువు.. రేవంత్కు టచ్లో బీజేపీ నేత?