మెగా స్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రం గత ఏడాది ఏప్రిల్ 9న విడుదల కావలసి ఉంది. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు కరోనాకి వాక్సిన్ రావడం, తిరిగి థియేటర్స్ తెరుచుకోవడం, ప్రేక్షకులు యధావిధిగా వస్తుండటంతో ఉప్పెన సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్ అసిస్టెంట్ సాన బుచ్చిబాబు ‘ఉప్పెన ‘ సినిమాతో దర్శకుడుగా పరిచయమవుతున్నారు.
వైష్ణవ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ‘ఉప్పెన’ సినిమాని ఫిబ్రవరి 5 న రిలీజ్ చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకులని ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా పాటలు జనంలోకి బాగా వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్ కృతిశెట్టి మీద కూడా క్రేజ్ ఏర్పడింది.
Must Read ;- సొట్టబుగ్గల సుందరి మరో ప్రాజెక్ట్ పట్టేసింది!