బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన స్నేహితురాలు నటాషా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గత సంవత్సరమే జరగాల్సిన ఈ పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ వివాహ వేడుక కరోనా కారణంగా కొద్ది మంది స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. దీనికి బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్, దర్శకనిర్మాతలు హాజరై నూతన వధూవరులు వరుణ్ ధావన్ – నటాషా లను ఆశీర్వదించారు.
ముంబైలోని అలీభాగ్ 5 స్టార్ హోటల్లో ఈ మ్యారేజ్ జరిగింది. ఈ కొత్త జంట మ్యారేజ్ తర్వాత మీడియాను కలిశారు. ఇదిలా ఉంటే.. ఈ పెళ్లిలో వరుణ్ ధావన్ సిబ్బంది ఫోటోలు తీయకుండా ఉండేందుకు వాళ్ల సెల్ ఫోన్ లకు స్టిక్కర్లు వేశారట. అంతే కాకుండా.. ఎవరైనా స్టిక్కర్ తీసేసి ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తే.. భద్రతా సిబ్బందికి వెంటనే సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారట.
ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తుంటే.. మరి కొంత మంది మాత్రం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం అంటుంది అంటూ సమర్థిస్తున్నారు. మొత్తానికి వరుణ్ ధామన్ మ్యారేజ్ సోషల్ మీడియాలో ఈరకంగా హాట్ టాపిక్ గా నిలిచింది.
Must Read ;- యాక్సిడెంట్ చేసిన పెళ్లికొడుకు వరుణ్ ధావన్.. ఏమైంది?