మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ఈ సంవత్సరం సమ్మర్ కి ఎన్టీఆర్ తో మూవీని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే.. కరోనా రావడంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. ఎన్టీఆర్ ముందుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేయాలి. ఆతర్వాత త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టాలి. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ వలన డైరెక్టర్స్ కి కావాల్సినంత టైమ్ దొరికింది.
ఈ లాక్ డౌన్ టైమ్ లో మన డైరెక్టర్స్ చాలా స్టోరీలు రెడీ చేసేశారు. త్రివిక్రమ్ అయితే.. ఈ లాక్ డౌన్ టైమ్ ని బాగా ఉపయోగించుకున్నారట. ఎన్టీఆర్ తో చేయనున్న సినిమా స్టోరీకి తుది మెరుగులు దిద్దారు. అంతే కాకుండా.. రెండు స్టోరీలు రెడీ చేసారట. అందులో ఒకటి ఎనర్జిటిక్ హీరో రామ్ కోసమని సమాచారం. ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం అయితే.. రామ్ తో సినిమా చేయాలి అనుకున్నారు. కథా చర్చలు జరిగాయి. అంతా ఓకే. అయితే.. ఎన్టీఆర్ మార్చి వరకు వెయిట్ చేయ్ మనం సినిమా చేద్దాం. ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కాకపోయినా మార్చి నుంచి డేట్స్ ఇస్తానని ఎన్టీఆర్ మాట ఇవ్వడంతో రామ్ తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారట త్రివిక్రమ్.
అయితే.. త్రివిక్రమ్ దగ్గర మరో కథ రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల భీష్మ తర్వాత తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు తన శిష్యుడు కోసం త్రివిక్రమ్ కథ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి త్రివిక్రమ్ రామ్ తో చేయాలనుకున్న కథని వెంకీ కుడుములకు ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్నది నిజమేనా.? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్టు అల్లు ‘రామాయణం’