Who Are The Invisible Political Forces Behind The Vallabhaneni Dynasty
అక్కా .. సారీ.. వెనుక మాస్టర్ ప్లాన్ ..!
వంశీ, కొడాలి నాని ఏపీలో రాజేసిన బూతు రాజకీయం .. జగన్ తోపాటు పొరుగు రాష్ట్రంలోని మరో ముఖ్యమంత్రి మొడకు సైతం చుట్టుకుటుంది. సామాజీక వర్గాల వారీగా సమరాన్ని రాజేసి.. ఎగదోస్తూ జగన్ రెడ్డి ఆడుతున్న నాటకం చివరికి పొరుగు రాష్ట్రంలోని మరో ముఖ్యమంత్రి కూడా ముప్పు తప్పేలా లేదు. అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యాఖ్యలను, అది విన్న చంద్రబాబు రోదనను ప్రపంచ మొత్తం చూసింది. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామక్రమం మారింది. ఎంతపెద్ద తప్పు చేశామోనని అధికార పక్షం తలలుపట్టుకున్న ఆపార్టీకి జరగవల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తప్పు సరిదిద్దుకుందామని అనుకున్నా.. క్షమించరాని ఆ తప్పుడు మాటలు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరి .. సర్వత్ర తీవ్ర ఖండనలు, విమర్శలను అధికారపార్టీపై గుప్పించేలా చేశాయి. తప్పదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే వల్లభనేని ఓ చానెల్ లైవ్ కార్యక్రమంలో నారా భువనేశ్వరికి వంశీ క్షమాపణలు చెప్పారు. అలా అనుకుంటే పొరపడినట్లే..వంశీతో అలా చెప్పించారు అన్నది తేటతెల్లం. బుధవారం ఓ చానెల్ లైవ్ స్క్రీన్ పై వంశీ నటన రక్తికట్టిందని అనుకున్నా అది అంతగా పండలేదు. పక్కా ప్రీప్లాన్డ్ గా రచించిన స్క్రిప్ట్ ను ప్లే చేసే ప్రయత్నంలో భాగమే వంశీ మాటల్లో.. అక్కా .. సారీ .. అనే పదాలు. వంశీకి స్క్రిప్ట్ రాసింది కమ్మ సామాజీక వర్గంలోని ఒక పెద్ద తలకాయైతే.. దానికి డైరెక్షన్ బాధ్యతలు వహించింది మాత్రం ఓ ప్రముఖ చానెల్ సంబంధించి వ్యక్తి అని క్లియర్ కట్ గా చూసేవాళ్లందరికీ అర్ధమైంది.
ఒక్కమాట .. ఒక జీవిత కాలం శిక్షా!
ఒక్కమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరని చిచ్చుని రాజేసింది. రాజకీయాలను, పార్టీలను సైతం పెట్టి సంకుల సమరానికి పురికొల్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలను సైతం పక్కన పెట్టి భువననేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటంబం సభ్యులు, అభిమానులు తీవ్ర అవేదనకు గురైయ్యారు. ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు మారాయి. కమ్మసామాజీక వర్గం నేతలే కాదు, పార్టీలకు అతీతంగా అధికారపార్టీ చర్యలను, నేతలను తిట్టిపోశారు. ఎన్టీఆర్ కుటుంబంపై ఏ కులం వారైనా పల్లెత్తు తప్పుడు కూతలు కూస్తే.. నాలుక తెగ్కొస్తాం అని ఒకస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని లను సోషల్ మీడియా అభిమానులు, తమ్ముళ్లు దుమ్మెత్తిపోశారు. ఎక్కడైనా కార్యక్రమాల వద్ద వంశీ, కొడాలి కనిపిస్తే సొంత కులం వారే నోటికొచ్చిన తిడుతున్నారు. అది గమనించిన జగన్ రెడ్డి ప్రభుత్వం కొడాలికి భద్రతను కూడా పెంచింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు సుదీర్ఘకాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలించి, అన్ని వర్గాలవారి మన్ననలను పొందిన ఎన్టీఆర్ కూతుర్ని, చంద్రబాబు సతీమణిని పట్టుకుని అసెంబ్లీలో అనరాని మాటలు అన్నారే.. ఇక రాష్ట్రంలో సగటు మహిళల పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి ఉద్దేశ్యంతో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని ప్రతిఒక్కరి ఒక క్లారిటి వచ్చింది. అది దావాలనంగా మారి అధికారపార్టీని దహించి వేస్తోంది. అంతేకాక జగన్ రెడ్డి కారణంగా పొరుగు రాష్ట్రంలో కూడా దీని ఇంపాక్ట్ తప్పక పడుతోంది.
Who Are The Invisible Political Forces Behind The Vallabhaneni Dynasty
ఏపీ బోర్డర్ దాటుకుని .. రగులుతున్న రాజకీయం!
జగన్ రెడ్డి దుందుడుకు చర్యలు చివరికి బొర్డర్లో ఉన్న పొరుగు రాష్ట్రాలకు సైతం చుట్టుకుంటున్నాయి. భువనేశ్వరి దూషించిన అంశంపై తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని పలువురు కమ్మ సామాజీక వర్గానికి చెందిన సీనియర్ పొలిటిషిన్స్ రాజకీయాలకు అతీతంగా స్పందించారు. నందమూరి కుటుంబం, ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం, సామాజీక వర్గాన్ని కించపర్చేలా మాట్లాడిన మాటలు వారిని కూడా బాధిస్తున్నాయి. మధిరా లో కమ్మ సామాజీక వర్గానికి చెందని ప్రజాప్రతినిధి ఒకడుగు ముందుకు వేసి తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇలా ఐదు జిల్లాలో సుమారు 50 నియోజకవర్గాల్లోని కమ్మసామాజీక వర్గం నేతలు ఏపీ అధికారపార్టీ నేతల మాటలను ఖండించారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా రగులుతున్న దీనిని చల్లార్చడానికే కమ్మ సామాజీక వర్గంలోని ఓ పెద్ద తలకాయగా చెప్పుకునే నేతను రంగంలోకి దించారు. ప్రస్తుతం ఆ నేత జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నేతలను కాపాడేందుకు టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. ఆక్రమంలోనే దిట్టుబాటు చర్యలకు ఉపక్రమించారు. దీనిని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు .. ఆపండి.. మీ నాటకాలంటూ సోషల్ మీడియా ట్రోల్స్ మొదలుపెట్టారు. ఫైనల్ గా ఇవి వంశీ సారీ స్క్రిప్ట్ వెనుకున్న అదృశ్య రాజకీయ శక్తులు.
Must Read ;- ముఖ్యమంత్రి అయ్యాకే వస్తా .. ఇక సభకు సెలవు!