ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాలు ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలతో రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీ వారి నుంచి 30 శాతం కమిషన్ తీసుకుని అన్ని కాంట్రాక్టు పనులూ వారికే అప్పగిస్తున్నారని, బూచేపల్లి వర్గీయులు కురిచేడులో కరపత్రాలు పంచడం సంచలనంగా మారింది. ఇకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో దర్శి వైసీపీ వ్యవహారం మంత్రి బాలినేని వద్దకు చేరింది.
ఎమ్మెల్యే చెప్పిన వారికే చెరువులు
దర్శి నియోగజకవర్గం పులిపాడు పంచాయతీ చెరువుల వేలం తూతూ మంత్రంగా సాగిందని బూచేపల్లి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినవారికే చెరువుల లీజు కేటాయించారనే విమర్శలు వస్తున్నాయి. బూచేపల్లి వర్గీయులు వేణుగోపాల్ అవినీతిపై కురిచేడులో కరపత్రాలు పంచిన వ్యవహారాన్ని మద్దిశెట్టి సీరియస్ గా తీసుకున్నారు. బూచేపల్లి వర్గీయుల ఆగడాలడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యే ఉన్న చోట ఎమ్మెల్యేలు, ఓడిపోయిన చోట ఇంఛార్జులు పెత్తనం సాగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో బూచేపల్లి వర్గం కొంచెం తగ్గినట్టు కనిపిస్తోంది.
Also Read ;- వీధి గుండాల్లా వైసీపీ నాయకుల బాహాబాహీ
ప్రతి మండలంలో ఐదురుగు ఏజంట్లు
దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అవినీతికి అంతేలేకుండా పోతోందని బూచేపల్లి వర్గం ఆరోపిస్తోంది. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఎమ్మెల్యేకు రూ.50 లక్షల లంచం ఇచ్చుకోవాల్సిందేనని వారు ఆరోపిస్తున్నారు. జాలర్ల సొసైటీలను కూడా వదలడం లేదని బూచేపల్లి వర్గీయులు కరపత్రాలు పంచడంతో ఇరువర్గాల మధ్య ఎప్పుడు ఘర్షణ చోటుచేసుకుంటుందోనని జనం బెంబెలిత్తిపోతున్నారు.
మరో ట్విస్ట్…
దర్శి వైసీపీ నేతల మధ్య చిచ్చు వ్యవహారంపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ మంత్రి బాలినేని పోలీసు అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దర్శి వైసీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేసుకుంటే పోలీసులతో ఎలా దర్యాప్తు చేయిస్తారు. వారు కేసులు పెట్టుకుంటే కదా, పోలీసులు రంగంలోకి దిగాల్సింది అనేది ప్రజల్లో మెదలుతున్న సందేహం. వైసీపీ అంతర్గత వ్యవహారాలకు కూడా పోలీసులను వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. కావాలనే బూచేపల్లి అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారని, దీనిపై అధిష్ఠానం వద్ద తాడోపేడో తేల్చుకోవాలని మద్దిశెట్టి వేణుగోపాల్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాకుండా చేయడం కోసం బూచేపల్లి ఇప్పటి నుంచే తప్పుడు ఆరోపణలు చేస్తూ వాటిని కరపత్రాల ద్వారా ప్రచారం చేయిస్తున్నారని మద్దిశెట్టి వేణుగోపాల్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- రచ్చ రంబోలా : డీఆర్సీలో వైసీపీ నేతల బూతు పురాణం











