‘జై చిరంజీవా’ సినిమాలో చిన్నారి చిచ్చరపిడుగు గుర్తుందా? అదేనండీ చిరంజీవి మేనకోడలుగా అల్లరి చేసిన అమ్మాయి. ఆమె పేరు శ్రీయా శర్మ. ఆ సినిమా కథాంశం ఆమె చుట్టూనే తిరుగుతుంది. తెరపై కనిపించేది కాసేపైనా, సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా.. ఎమోషనల్ గా అందరినీ వెంటాడుతుంది ఆమె కేరక్టర్. ఆ తర్వాత ఆమె రజనీకాంత్ ‘రోబో’ లో క్లైమాక్స్ లో వచ్చే మ్యూజియమ్ సీన్ లో కనిపిస్తుంది.
ఈ రెండు సినిమాల తర్వాత మరికొన్ని మూవీస్ లో మాత్రమే నటించిన శ్రీయా శర్మ .. ఆ తర్వాత ‘కసౌటీ జిందగీ కే’ అనే సీరియల్ తోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ లోనూ, ఆ తర్వాత ‘గాయకుడు’ అనే మరో సినిమాలోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించడం మానేసిన శ్రీయా శర్మ.. లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రెడ్ శారీలో ట్రెండీ లుక్ లో అదరగొడుతోంది శ్రీయా శర్మ. అప్పటి పాలబుగ్గల పాపేనా.. ఈ బ్యూటీ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు పాతికేళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టిన ఆమె ముగ్ధమోహన రూపానికి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. నటించడంతో పాటు.. లాయర్ గా వాదించడం కూడా ఇష్టమంటోంది. కాస్తంత బొద్దుగా ఉందనే కామెంట్స్ తో కూడిన కంప్లైంట్స్ తప్ప.. మరే విధమైన లోపాలు ఆమె సౌందర్యంలో కనిపించడం లేదని అంటున్నారు. మరి శ్రీయా శర్మ.. ఇంకెన్ని అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.
Must Read ;- చిన్న గౌను వేసుకున్న తెలుగు పాప..!