లాక్ డౌన్ తరువాత యువ కథానాయకులంతా ఉత్సాహంతో రంగంలోకి దిగిపోతున్నారు. ఎవరికి వారు కొత్త ప్రాజెక్టులను పరుగులు తీయించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అడివి శేష్ కూడా ఈ రేసులో కనిపిస్తున్నాడు. చిన్నచిన్న పాత్రలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన అడివి శేష్, యువకథానాయకుల జాబితాలోకి చేరడానికి వెనుక ఎంతో కష్టం దాగుంది. మొదటి నుంచి కూడా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా ‘మేజర్‘ రూపొందుతోంది.
‘మేజర్‘ సినిమాకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మిగతా భాగం చిత్రీకరణకు అవసరమైన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన ‘ఫస్టు లుక్’ పోస్టర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు పెంచేదిగానే ఈ ఫస్టులుక్ ఉంది. మహేశ్ బాబు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. కథాకథనాల్లో కొత్తదనం ఉండటం వల్లనే మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. “మొదటి నుంచి కూడా నాకు సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ, మనసంతా సినిమావైపే లాగుతూ ఉండేది. సినిమాల్లోకి వెళ్లి ఏదో సాధించాలనే తపన నాలో పెరుగుతూ వచ్చింది. దాంతో అమెరికాలో ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేశాను. అమెరికా నుంచి ఇక్కడికి రాగానే, అప్పటివరకూ నేను దాచుకున్న డబ్బులతో ఒక సినిమాను నిర్మించాను. అత్యుత్సాహంతో నేను చేసిన ఆ పని వలన ఆర్ధికంగా చాలా నష్టపోయాను.
ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి .. కానీ అవన్నీ చిన్న చిన్న పాత్రలు. అందువలన నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఒక సినిమాను నిర్మిచాను. నేను హీరోగా చేసిన ఆ సినిమా నన్ను ఆర్ధికంగా మరింత దెబ్బతీసింది. ఆ సమయంలో రూమ్ రెంట్ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు .. చాలా ఇబ్బందులు పడ్డాను1A. ఆ గడ్డు రోజులను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ప్రస్తుతం నా కెరియర్ బాగుంది .. మంచి సినిమాలు చేస్తూ వెళుతున్నాను. ‘మేజర్’ సినిమా నా కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- ‘మేజర్’ లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన గూఢచారి