మాస్ పల్స్ బాగా తెలిసిన హీరోల్లో మనకు బాలయ్య బాబు తప్ప ఇంకెవరూ కనిపించరు. అలాంటి పాత్ర ఆయనకు వస్తే దానికి ఉండే స్పందనే వేరు. అదే ఇప్పుడు జరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన ‘అఖండ’ సినిమా ట్రైలర్ నిన్న ఇదే సమయానికి విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు అదే సమయానకి ఈ ట్రైలర్ 10 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టిందంటే జనం స్పందన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే విడుదలైన ట్రిపుల్ ఆర్ ‘నాటు నాటు’ పాట రేంజ్ లో ఈ వ్యూస్ ఉన్నాయి.
ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టేలా అనిపిస్తోంది. ఇంతకుముందు ఇదే కాంబినేషన్ లో సింహా, లెజండ్ చిత్రాలు వచ్చాయి. అఖండ ను డిసెంబరు 2న విడుదల చేయబోతున్నారు. ‘విధికీ విధాతకూ విశ్వానికీ సవాళ్లు విసరకూడదు’ అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. డైలాగుల్లోనే ఈ సినిమా స్టామినాని బోయపాటి చూపించారు. ‘అంచనా వేయడానికి పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా?.. పిల్ల కాలువ’, ‘ఒక మాట నువ్వంటే శబ్దం.. అదే నేనంటే శాసనం.. దైవ శాసనం, మీకు సమస్య వస్తే దండం పెడతారు.. నేను పిండం పెడతాను’ అంటూ ఈ సినిమాలో మాటల ప్రవాహం సాగుతుంది. ఇలాంటి డైలాగ్ బాలయ్య నోటి నుంచి వస్తే అభిమానుల స్పందన వేరేలా ఉంటుంది.
‘నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే’ అంటూ శ్రీకాంత్ కూడా తన విలక్షణ విలనిజాన్ని చూపించారు. తమన్ రీరికార్డింగ్ ఈ సినిమాకి హైలైట్ గా చెప్పాలి. ఈ ట్రైలర్ 50 మిలియన్ల క్లబ్ లో చేరాలంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అఖండ ట్రైలర్ చూసాక ఈ నిమిషం నా ఫీలింగ్ ఏంటో తెలుసా… ‘బుల్లెట్ మీద సైలెన్సర్ పీకి… జై బాలయ్య జెండా కట్టి.. పెనమలూరు సెంటర్ నుంచి వైట్ పంచెలో ఎన్టీఆర్ సర్కిల్ వరకూ వెళ్ళి మెయిన్ స్టాండ్ వేసి బండి మీద నుంచుని “జై బాలయ్య… నిన్ను ఢీ కొట్టేది ఎవడయ్యా” అని తొడ కొట్టి అరవాలనుందంటూ మరో అభిమాని కామెంట్ చేశాడు.
Must Read ;- ‘భం అఖండ’ అంటూ అదరగొట్టిన బాలయ్య