స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మల్టీస్టారర్ రానుందని వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి టైమ్ లో ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి టాక్ రావడంతో అటు బన్నీ ఫ్యాన్స్, ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సంవత్సరంలోనే ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వెళుతుంది అని కూడా టాక్ వినిపిస్తోంది.
అంతే కాకుండా.. ఈ క్రేజీ మల్టీస్టారర్ కు యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ దర్శకత్వం వహించనున్నారని.. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించనున్నారని కూడా వినిపించింది. అయితే.. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమాలో చేయడానికి ఓకే చెప్పారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ మూవీ చేస్తున్నారు. త్వరలో తాజా షెడ్యూల్ ముంబాయిలో స్టార్ట్ కానుంది.
ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ తో ఓ మూవీ, శివ నిర్వాణతో ఓ మూవీ చేయనున్నారు. ఇలా బన్నీ, విజయ్ రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో.. ఈ సంవత్సరంలోనే వీరిద్దరూ కలిసి నటించనున్నారనేది వాస్తవం కాదు అని తెలుస్తుంది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా.? కాదా..? అని ఆరా తీస్తే.. ప్రచారంలో ఉన్న వార్తలో నిజం లేదని బన్నీ క్యాంపు నుంచి సమాచారం. మరి.. భవిష్యత్ లో అయినా ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందేమో చూడాలి.
Must Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్