జగన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా నిరాశే..!
జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీ ఉద్యోగులకు మిగిలింది నిరాశే..! నమ్మి రెండు చేతులతో ఓట్లేసిన పాపానికి.. మాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని ఉద్యోగులు అంతర్మథనంలో మగ్గిపోతున్నారు. వారంలో పీఆర్సీ, సీపీఎస్ రద్దు అని చెప్పిన పెద్ద మనిషి.. గొర్రె కసాయి అన్న సామెతలా ఉద్యోగులను నిలువున వంచించాడు! గురువారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశం కూడా అప్పట్లాగే పిల్చి.. ఉసురుమనిపించారు. అవమానించేందుకు ఇలా సమావేశానికి పిలిచి, తేల్చకుండా తిరిగి పంపించడం సమంజసం కాదని జేఏసీ నేతలు బండి, బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ పై ఎటువంటి పురోగతి లేదని, ఉద్యోగ, ఉపాధ్యాయ బిల్లులు, జీపీఎఫ్, మెడికల్ బిల్స్ అన్నీ పెండింగ్ లో పెట్టి.. ఏది తేల్చకుండా రాష్ట్ర అర్థిక పరిస్థితిని వివరించేందుకు సమావేశాలకు పిలుస్తున్నారని వాపోయ్యారు.
జనవరి 3 వరకు డెడ్ లైన్..!
పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్ లను కలుపుకుని మొత్తం 71 డిమాండ్లను ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంయుక్త కార్యచరణ కమిటి నేతలు ప్రభుత్వం ముందుంచారు. కనీసం 30 శాతం మేరకు పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు పట్టుపడుతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం 14 నుంచి 16 శాతం మేరకే ఇస్తామని పాట పాడుతోంది. అయితే ప్రభుత్వ సూచనలను తొసిపుచ్చుతూ.. ఉద్యోగుల తీవ్ర అభ్యంతరాలయితే తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ మూడు రోజులో స్పందించకుంటే జనవరి 3 నుంచి నిర్విరామ దీక్షలతో సమ్మెకు దిగుతామని జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. అడిగినంత పీఆర్సీ ఇవ్వకుంటే ప్రభుత్వంతో తాడేపేడో తెల్చుకునే వరకు ఉద్యమాన్ని విరమించమని ఉద్యోగ సంఘాల జేఏసీలు ఇప్పటికే ప్రకటించాయి.
Must Read ;- 13 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు .. వారాల తరబడి తాకట్టా?