ఉమ్మేసినా … దుమ్మెత్తిపోసిన సిగ్గులేని జీవితాలు!
రాష్ట్ర ఆదాయాన్ని హారతి కర్పూరంలా కరగదీశారు….. పాడి ఆవులాంటి రాజధానిని ఒట్టిపోయేలా చేసి .. కసాయి కొట్టుకు పంపారు! మూడు ముక్కలు చేసి .. ఏపీ రాజధాని స్వరూపాన్ని మార్చారు…. చివరికి సాధించింది ఏమీలేదు పతనం తప్ప! మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు .. కేబినెట్ లో తీర్మానించి.. అసెంబ్లీలో బిల్లు చేస్తారు! వికేంద్రీకరణకు వికృతార్థాలు పలికి దేశంలో ఆంధ్రులు పరువును రోడ్డుకీడ్చారు. ఇప్పుడు విస్తృత ప్రయోజనాలు, సమగ్ర వికేంద్రీకరణ బిల్లు అంటూ మరో విధ్వంసకర పంథాను అందుకున్నారు. మీకేమైనా ఆర్థమౌతుందా జగన్ రెడ్డి గారు … జాతీయ, అంతర్జాతీ స్థాయిలో మన పరువు ఏ రేంజ్ లో దిగజారుతోందో అని ప్రతిపక్షాలు, ప్రజలు ఉమ్మెసి, దుమ్మెత్తి పోస్తున్నా చలనంలేదు. మంగళవారం మంత్రి బుగ్గన అసెంబ్లీలో గతంలో శాసనమండలి రద్దు బిల్లును నేడు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. నిన్న మూడు రాజధానులు, నేడు శాసన మండలి రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటున్న చెప్పి .. అవకాశవాద రాజకీయాలకు మరోసారి తెరతీశారు. చివరికి రాష్ట్రం అన్నివిధాలుగా మరో అర్థ శతాబ్ధం వెనక్కిపోయిందన్న సంగతి ఇంకా జగన్ రెడ్డి ప్రభుత్వానికి అర్థకాకపోవడం పెద్ద ఆశ్చర్యం!
చట్టాలు, చట్ట సభలకు ఏనాడో నీళ్లు!
ఎక్కడో నొక్కాల్సినకాడ స్వీచ్ నొక్కితే .. ఏపీలో అధికారపార్టీ నాయకుల బుర్రల్లో దీపాలు వెలుగుతున్నాయి. నిన్న అమరావతిలో అధికారపార్టీ హైడ్రామా ఒక రేంజ్ లో ప్లే చేసింది. సరిగ్గా 2019, డిసెంబర్ 17న వికేంద్రీకరణ సూత్రంతో మూడు రాజధానుల మంత్రాన్ని అందుకున్నారు. సీఆర్డీఏ రద్దు, పాలన, శాసన, న్యాయ అంటూ … కలరింగ్ ఇచ్చారు. మూడు రాజధానుల బిల్లును ఆమోదించలేదని .. శాసన మండలిని కూడా రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మరి ఇప్పుడు రద్దు చేసిన వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం అవకాశవాద రాజకీయ పుస్తకంలో పేజీలు కావా ? అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నిసార్లు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్తును బ్యాంకుల పాలుచేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్నాయి. నేటికి ముఖ్యమంత్రి హోదాలో జగన్, మంత్రులు ఏపీ రాజధాని అమరావతే అని ప్రకటించలేక నీళ్లు నిమురుతున్నారు ఏం? శాటిలైట్ మ్యాప్ లో ఏపి రాజధాని ఏం చూపిస్తుందో అందరికీ అర్థమౌతోంది .. కానీ ఈ ప్రభుత్వానికే అర్థంకావడం లేదు .. అమరావతి అనే అగ్ని ఖిలను రాజేశాం .. అందులో దహించవేయబడుతుంది మనమే అని!.
Must Read ;- దివాలకు దరిదాపుల్లో ఏపీ ప్రభుత్వం!