అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ దసరాకి రానున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో మిగిలిన భారీ చిత్రాలు సమ్మర్ కి, సమ్మర్ తర్వాత వచ్చేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. భారీ చిత్రాలు వరుసగా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తుండడంతో టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైంది. ఒక విధంగా చెప్పాలంటే.. 2021లో రానున్న సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అవ్వడంతో ఇక ఈ సంవత్సరం ఫుల్ అయ్యినట్టే.
వచ్చే సంవత్సరం సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాని ఎనౌన్స్ చేశారు. అయితే.. 2022 సంక్రాంతికి టాలీవుడ్ లో బిగ్ ఫైట్ జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సలార్’. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కానుంది.
ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు దసరాకి ‘ఆర్ఆర్ఆర్’ వస్తుండడంతో సలార్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. అలాగే.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న మూవీని కూడా సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్, ‘వేదాళం’ రీమేక్ రెండింటిలో ఏదొకటి సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అందుచేత.. 2022 సంక్రాంతికి టాలీవుడ్ లో బిగ్ ఫైట్ జరగడం ఖాయం.
Must Read ;- ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ కథానాయిక ఈమే