నందమూరి నట సింహం బాలకృష్ణ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గురించి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈతరంలో బాలయ్యను పవర్ ఫుల్ గా చూపించే డైరెక్టర్ ఎవరు అంటే.. అందరూ ఠక్కున చెప్పే పేరు బోయపాటి శ్రీను. అందుకనే ఈ మూవీ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా తర్వాత రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. బాలయ్య పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. ఇందులో విలన్ ఎవరు అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. తాజా వార్త ఏంటంటే.. బోయపాటి ఈ మూవీ కోసం బాలీవుడ్ విలన్ ని రంగంలోకి దింపుతున్నారని తెలిసింది. ఇంతకీ.. ఆ బాలీవుడ్ విలన్ ఎవరంటే.. సునీల్ శెట్టి అని సమాచారం. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన సునీల్ శెట్టి ఇప్పుడు సౌత్ సినిమాల్లో విలన్ గా నటిస్తున్నారు. రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో సునీల్ శెట్టి విలన్ గా నటించారు. ఇప్పుడు బాలయ్య మూవీలో విలన్ గా నటించనున్నారని తెలిసింది.
సీనియర్ బాలయ్య క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. ఆ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సునీల్ శెట్టి కనిపించనున్నారు అంటున్నారు. ఆయన గెటప్ చాలా డిపరెంట్ గా ఉంటుందట. ఇటీవల సునీల్ శెట్టికి బోయపాటి కథ.. ఇందులోని ఆయన క్యారెక్టర్ చెప్పారట. క్యారక్టరైజేషన్ నచ్చడంతో ఓకే చెప్పారని తెలిసింది. అయితే.. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయాల్సివుంది. జయ జానకి నాయక చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. భారీ అంచనాలతో రానున్న ఈ మూవీతో బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ సాధిస్తారని ఆశిద్దాం.
Must Read ;- బాలయ్య సినిమాలో యువ ఎమ్మెల్యేగా నారా వారబ్బాయి?