ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మెగాస్టార్ కి ఆహ్వానం అందింది. కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమైనా ఏపీలో టిక్కెట్టు ధర సమస్యాత్మకం అయిన సంగతి తెలిసిందే. సవరించిన ధరలతో ఎగ్జిబిషన్, పంపిణీ రంగాలు చిక్కుల్లో పడ్డాయి. థియేటర్ల సమస్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు. సీఎం జగన్ తో భేటీ కోసం సినీపెద్దలు ప్రయత్నిస్తున్నారని వార్తలొచ్చాయి. ఏపీ మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్ చిరంజీవికి శనివారం ఫోన్ చేసి సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సమస్య వివరిచాల్సిందిగా చిరంజీవిని కోరారు.
జగన్ తో జరగబోయే కీలక భేటీలో ప్రస్తుతం ఉన్న థియేటర్ల సమస్య గురించి, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల బతుకు తెరువు సహా.. పంపిణీ వర్గాల వేతనాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. చిరంజీవితో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు హాజరు కానున్నారు. ఇంతకుముందు సీఎంతో భేటీలో చిరంజీవి- నాగార్జున – రాజమౌళి– సురేష్ బాబు బృందం సమస్యలు విన్నవించగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
అలాగే గతంలో పరిశ్రమకు అనుకూలంగా సీఎం జగన్ ఎప్పుడు వరాలు ఇచ్చినాచిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ భేటీ ఈ నెల చివరి వారంలో జరగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి సమస్యకు తక్షణ పరిష్కారం చూపిస్తారని అంతా అశతో ఎదురుచూస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహా మేరకు ఈ నెల చివరి వారంలో ఏపీ సీఎంతో భేటీకి సినీ ప్రముఖులు సిద్దమవుతున్నారు.
Must Read ;- మెగాస్టార్ ఎంట్రీ.. ‘మా’కు తక్షణ ఎన్నికలే











