రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన విక్టరి వెంకటేష్ అరణ్య మూవీ స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, హీరోయిన్ జోయా హుస్సేన్, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పాల్గొన్నారు.
డైరెక్టర్ ప్రభు సాల్మన్ వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ – ‘‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. రేపు థియేటర్లలో అరణ్య సినిమా మాట్లాడుతుంది. రానా, విష్ణువిశాల్, పుల్కిత్ సామ్రాట్, జోయా, శ్రీయాలతో పాటుగా దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ సాంకేతిక నిపుణులకు కూడ ధన్యవాదాలు. ముఖ్యంగా సౌండ్ ఇంజినీర్ రసూల్, శాంతనులకు థ్యాంక్స్. ప్రకృతి, ఏనుగులు వంటి వాటిపై అరణ్య వంటి ఓ సినిమా తీసేందుకు సపోర్ట్ చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు థ్యాంక్స్“ అన్నారు
రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ – ‘‘అరణ్య’ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోతుంది. ప్రాణం, మనసుపెట్టి చేస్తే కానీ ఇలాంటి సినిమాలు రావు. రానా తన జీవితాన్ని మర్చిపోయి ఈ సినిమాలోని పాత్రలో జీవించాడు. అరణ్య సినిమా సూపర్హిట్ కావాలి. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు వచ్చేందకు అరణ్య ఓ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. నేను మాటలు రాసిన తొలి సినిమా కృష్ణం వందే జగద్గురుమ్లో రానా హీరో. నేను రాసిన మొదటి డైలాగ్స్ను పలికిన హీరో రానా. ఇప్పుడు నేను ఈ స్టేజ్పై ఉన్నానంటే అందుకు ఓ కారణం రానా’’ అని అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ – “కెమెరా ముందు ఒక వ్యక్తి ఎలా ఉండాలో నాకు నేర్పించింది శేఖర్ కమ్ములగారు ఆయన కార్యక్రమానికి రావడం హ్యాపీగా ఉంది. నేను చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్పడానికి ఆయన్ని ఇక్కడికి పిలిచాను (నవ్వుతూ). సాయి మాధవ్గారు, క్రిష్గారు కలిసి కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో మొత్తం భాగవత తత్వం నేర్పించారు. ఆ సినిమాలో సాయి మాధవ్ గారు రాసిన ఒక లైన్ నా జీవితాంతం మిగిలిపోయింది అది ఏంటంటే `చప్పట్లంటే వ్యసనం..ఆ చప్పట్ల మధ్యన ఒక్కడుంటాడు..దీనమ్మ ఇది నిజమే కదా అని చూస్తుంటాడు..ఆ ఒక్కడికోసం నువ్వు నాటకం ఆడు“ అని ఇప్పుడు ఆ ఒక్కడి కోసమే ఈ సినిమా కూడా చేశాను. నాకు చిన్నానలో ఏదోఒక పార్ట్ అవ్వాలని కోరిక ఉండేది. 11సంవత్సరాల తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను..బాగా యాక్టింగ్ చేయగలుగుతున్నాను అని ఆయన్నిఛీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఈ సినిమాలో మా నాన్న పాత్రకి చిన్నాన వాయిస్ఓవర్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను అడివిమధ్యలో..ఏనుగుల దగ్గర ఉన్నాను. ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. ఒక రియల్ రెయిన్ ఫారెస్ట్ మధ్యలో ఉండే ఎక్స్పీరియన్స్ మీకు ఈ నెల 26న అరణ్యతో తెలుస్తుంది. ఆ అడవిలో మనుషులు చేసే అరాచకాన్ని ఈ సినిమా చూపిస్తుంది.
ఈ రోజు ఎక్కడ అడివి ఉన్నా సరే ఇలాంటి ఓ సమస్య ఉంది. నేను ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు అడవిలో ఉన్నా.. నాకు ఆ ఏనుగులతో ఉన్న రిలేషన్ వల్ల నా జీవితంలో ప్రతి మనిషితో నాకున్న రిలేషన్ మారిపోయింది. మాములుగా నువ్వు ఎవరు? అని తెలుసుకోవాలి అంటారు కాని ఈ సినిమా నాకు నేను ఎందుకు? అని నేర్పించింది. మీరు ఈ భూమ్మీదే ఉంటారు ఈ భూమికోసం పనిచేస్తే ఆ భూమి తిరిగి మీకు, మీ తరతరాలకు ఇస్తుంది అని ఏనుగులు నేర్పించాయి. ప్రభు సాల్మోన్ ఒక ఫోటో చూసి నన్ను సెలక్ట్ చేశారు. నాకు ఎంతో నేర్పించిన వ్యక్తి అయన. ఈ సినిమా థాయిలాండ్, కేరళ, సతార్, మహా భలేశ్వరం,. ఇలా ఆరు అడవులలో తీశాం. ఈ సినిమా మా అందరిలో మార్పు తెచ్చింది. జీవితంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన ఎలా ఈజీగా తీసుకోవాలో నాకు ఈ సినిమా నేర్పించింది. ఈ నెల 26న మీరు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లబోతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఈరోస్ వారికి నా స్పెషల్ థ్యాంక్స్“ అన్నారు.
విక్టరి వెంకటేష్ మాట్లాడుతూ – ‘‘ప్రకృతితోనే మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. శనివారం అరణ్య సినిమా చూశాను. అరణ్య సినిమా మనం అందరం గర్వపడేలా ఉంది. లీడర్, ఘాజీ, బాహుబలి వంటి సినిమాల్లో రానా విభిన్నమైన పాత్రలు పోషించాడు. తన జర్నీలో యాక్టర్గా నేర్చుకుంటున్నాడు అనుకున్నాను. కానీ అరణ్య సినిమాలోని పాత్రలో రానా ఒదిగిపోయిన తీరు చూస్తుంటే …యాక్టర్గా రానా చాలా ఎదిగాడని అనిపిస్తుంది. అరణ్య సినిమాలోని ఫస్ట్ ప్రేమ్ నుంచే రానా పెర్ఫార్మెన్స్ చూసి నేను స్టన్ అయ్యాను. ఇండియన్ స్క్రీన్పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్ను ఎంచుకున్న రానాను అభినందిస్తున్నాను. రానా బాడీ లాంగ్వేజ్ కూడ పాత్ర సరిపోయింది. చాలా సంతోషంగా కూడా ఉంది. ఒక్కరానానే కాదు. విష్ణువిశాల్, జోయా, ప్రియాంకా ఇలా అందరు వారి వారి క్యారెక్టర్స్లో లీనమైపోయారు. ఫారెస్ట్ లొకేషన్స్లో షూటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా జంతువుల హవాభాలను కెమెరాలో షూట్ చేయడం కష్టం. కానీ దర్శకుడు ప్రభు సాల్మన్ అండ్ టీమ్ చాలా కష్టపడి తీశారు. ఈ టీమ్ అందరు సిన్సియారిటీ, హార్డ్వర్క్, డేడికేషన్తో ఈ సినిమా చేశారు. మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. అరణ్య సినిమా పెద్ద సక్సెస్ కావాలి“ అన్నారు.
Must Read ;- ట్రైలర్ టాక్: ‘అరణ్య’గా రానా ఏంచేయబోతున్నాడు?