టాలీవుడ్ హీరోల్లో టాక్ షోస్ ఎక్కువ చేసిన హీరోగా దగ్గుబాటి రానా టీవీ వీక్షకులకు బాగా గుర్తుండిపోయాడు. చాలా మంది సెలబ్రిటీస్ తో మూడు సీజన్స్ అతడు విజయవంతంగా చేశాడు. ఆ టాక్ షో పేరు ‘నెం. 1 యారీ’. జెమినీ టీవీలో ఒకప్పుడు ప్రసారమైన ఈ షో .. ఇప్పుడు రూట్ మార్చి.. యాప్ లో కి అడుగుపెడుతోంది. అందులోనూ అది అల్లు వారి ఫేమస్ యాప్ ఆహాలో అవడం విశేషం.
‘ఆహా’ ఓటీటీలో త్వరలోనే రానా టాక్ షో నెం. 1 యారీ మళ్ళీ ప్రారంభం కాబోతోంది. ఇంతకు ముందు సమంతా అక్కినేని హోస్టింగ్ తో సామ్ జామ్ స్ట్రీమ్ చేసిన ఆహా.. త్వరలో రానా దగ్గుబాటితో నెం. 1 యారీ టాక్ షో మొదలు పెట్టబోతోంది. అది కూడా ఈ నెల 14నుంచి ప్రారంభం కాబోతోంది.
గతంలో జెమినీ టీవీలో ప్రసారమైన నెం. 1యారీ టాక్ షో .. రానా హోస్టింగ్ తో మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మూడు సీజన్స్ లోనూ రానా హోస్టింగ్ చేశాడు. చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ను తీసుకొచ్చి వారితో ఈ షోను విజయవంతంగా నడిపాడు. ఇప్పుడు జెమినీ నుంచి ఆహా స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుంది. మరి ఈ సారి గెస్ట్స్ గా ఎలాంటి సెలబ్రిటీస్ వస్తారో చూడాలి.
Must Read ;- దుశ్యంతుణ్ణి పరిచయం చేసిన అందాల శకుంతల