ఇటీవల గుంటూరులో జరిగిన దళిత యువతి రమ్యశ్రీ హత్యపై, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై జాతీయ ఎస్సి కమిషన్ కు ఫిర్యాదు ఇచ్చారు టీడీపీ నాయకులు. ఈ సందర్బంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్రంలో దళితులు గ్రామ బహిష్కరణ, దళితులపై దాడులు, దళిత మహిళలపై ఆత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ..అయినా ప్రభుత్వం వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకపోగా, దోషులను శిక్షించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వ అలసత్వంపై చర్యలు తీసుకొని దళితులకు రక్షణ కల్పించాలని కోరినట్లు సమాచారం.
దళితుల పక్షాన టీడీపీ..
వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై, దాడులపై, టీడీపీ దళితుల పక్షాన నిలబడి పోరాడుతున్న అంశాలు పరిశీలిస్తే…
1. దళితులకు పారిశ్రామిక రాయితీలు కోత
2. ఎస్సీ సబ్ ప్లాన్ నిర్వీర్యం
3. దళితులకు, గిరిజనులకు భూ కొనుగోలు పథకాన్ని నీరుగార్చడం
4. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను రెండేళ్లలో వేలాది ఎకరాలు ఈ ప్రభుత్వం గుంజుకోవడం
5. అంబేడ్కర్ విదేశీ విద్యను నీరుగార్చడం
6. దళితుల స్వతంత్ర ఎదుగుదలకు, సాధికారతకు ఉపయోగపడే పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడం.
7. ప్రజా రాజధాని అమరావతికి భూములిచ్చిన దళిత రైతులపై అక్రమ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బేడీలు వేసి జైల్లో పెట్టడం.
8. ఫ్రంట్ లైన్ వర్కర్ అయిన దళిత యువతి లక్ష్మీ అపర్ణను విశాఖ నడిరోడ్డులో పోలీసులు పడదోసి రెక్కలు విరిచిన సంఘటన.
9.వైసీపీ ప్రభుత్వం జడ్జి రామకృష్ణ పై అక్రమ రాజద్రోహం కేసు పెట్టి 50 రోజులుగా జైళ్లో పెట్టించడం.
10. డా. సుధాకర్ ను విశాఖ నడిరోడ్డులో బట్టలూడదీసి, దారుణంగా హింసించి, పిచ్చివాడిగా చిత్రించిన సంఘటన.
11. ఇసుక మాఫియాను ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు పోలీసు స్టేషన్ లో శిరోముండనం.
12. పల్నాడులో దళితులపై దాడి చేసి తరిమి తరిమి కొట్టి గ్రామ బహిష్కరణ చేసిన వైసీపీ నేతలు.
13. పల్నాడులో దళిత యువకుడు విక్రంను స్థానిక పోలీసుల సహకారంతో హైదరాబాద్ నుంచి పిలిపించి హత్య.
14. చీరాలలో మాస్క్ ధరించలేదని దళిత యువకుడు కిరణ్ ను పోలీసులు లాఠీలతో కొట్టి కొట్టి చంపిన సంఘటన
15. గుంటూరు జిల్లా, నకరికల్లిల్లో గిరిజన మహిళ ను ట్రాక్టర్ తో గుద్దించి, ఆమెపై ఎక్కించి దారుణంగా చంపిన వైసీపీ నాయకుడు.
16. మద్యం అధిక రేట్లను ప్రశ్నించిన దళిత యువకుడు ఓం ప్రతాప్ చావుకు కారణమైన పెద్దమనుషులను ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడం
17. దళిత డాక్టర్ అనితా రాణిపై వైసీపీ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించి, ఆమెను అవమానిచడం
18. పులివెందులలో దళిత మహిళను మానభంగం, హత్య .
19. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రేమ వివాహం చేసుకున్న జంటపై మంత్రి అనుచరులు దాడి
20. పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ లో పై స్థానంలో ఉన్న దళితులను కాదని దిగువ స్థానంలో ఉన్న ‘రెడ్డి’ గారిని ఇంజనీర్-ఇన్-ఛీప్ చేస్తే, రిటైర్ అయిన తరువాత కూడా ఆయన పదవీకాలం పొడిగించడం.
21. మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి పి.వి. రమేష్ పట్ల అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఒక సీనియర్ పోలీస్ అధికారి, ఆయన భార్య అయిన పివి రమేష్ సోదరిని గృహహింసకు గురిచేసి, అదనపు కట్నం కావాలని హిసించి, దౌర్జన్యం చేసి ఆమెను ఇంటి నుండి గెంటేయడం.
22. మాజీ ఎంపీ హర్ష కుమార్ పై ప్రభుత్వ జులుం
పై సంఘటనలపై రాష్ట్రపతి, గవర్నర్, జిల్లా పోలీసు అధికారులు దృష్టికి తీసుకెళ్లడం, దళితుల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహించింది టీడీపీ.
వైసీపీని వీడుతున్నారు
మొన్న గుంటూరు లో రమ్యశ్రీ సంఘటన పై టీడీపీ అత్యంత వేగంగా స్పందించి నిందితులను 21 రోజుల లోగా కఠినంగా శిక్షించాలని డెడ్ లైన్ పెట్టింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో మెజారిటీ దళితులు గత ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డిని గెలిపించారు. కానీ జగన్ పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాలు, దళితులపై జరుగుతున్న దాడులు గమనిస్తున్న దళిత సంఘాలు జగన్ పై ఉన్న భ్రమలు తొలగి దళితుల పక్షాన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ తో కలసి దళితుల పై జరుగుతున్న దమనకాండ పై ఐక్య ఉద్యమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయని సమాచారం.
Must Read ;- జగన్ కు లోకేష్ డెడ్ లైన్ పెట్టేశారు!