కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో సిద్ధహస్తుడైన మరో చెప్పుకోదగ్గ దర్శకుడు మారుతి. మరీ అంత భారీగా పోకుండా.. మీడియం రేంజ్ బడ్జెట్ తో నిర్మాతలు పెట్టిన పెట్టిబడిని తిరిగి తీసుకురావడమే కాకుండా.. కాస్తో కూస్తో లాభాల్ని తెచ్చిపెట్టే దర్శకుడిగా మారుతికి మంచి పేరు. అందుకే అతడితో సినిమాలు తీయడానికి బడా సంస్థలే ముందుకొస్తుంటాయి. ఈ నేపథ్యంలో మారుతి నుంచి ఓ చిన్న సినిమా రాబోతోంది.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో గోపీచంద్ , రాశీఖన్నా జంటగా ‘పక్కా కమర్షియల్’ మూవీ సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ గ్యాప్ ను మారుతి ఓ మినీ మూవీ కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. అది కూడా ఓటీటీ కి. రీసెంట్ గా సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథను ఓటీటీ కోసం తీసి.. భారీ లాభాలు అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే యూవీ క్రియేషన్స్ సంస్థ అదే హీరోతో మరో ఓటీటీని మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిస్తున్నాడు.
‘కాలనీలో ప్రేమాయణం’ అనే టైటిల్ తో రూపొందే ఈ సినిమాకి మారుతి నే కథ అందిస్తున్నాడు. రెండిళ్ళ మధ్య నడిచే రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమా. కేవలం ఒక నెల్లో కంప్లీట్ చేసి సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ సినిమా మూడు రోజుల నుంచి చిత్రీకరణ జరుపుకుంటోంది. మెహ్రీన్ కథానాయికా నటిస్తున్న కాలనీలో ప్రేమాయణం.. సంతోష్ శోభన్ కు మరో మినీ కథ అవుతుందేమో చూడాలి.
Mustv Read ;- మినీ కథ హీరోతో మీడియమ్ రేంజ్ డైరెక్టర్ ?