తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయింది 11 మంది కాదని అంతకంటే ఎక్కువేనని ప్రతిపక్షాలు ఆరోపించినదే నిజమైంది.ఈ ఘటనలో 23 మంది మరణించినట్లు ఏపీ ప్రభుత్వం కూడ అంగీకరించి మిగతా 12 మందికి కూడ ఎక్స్ గ్రేషియో చెల్లించడానికి చర్యలు చేపట్టింది.తొలుత ఈ ఘటనలో 11 మంది చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించగా ఇంకా ఎక్కువ మంది చనిపోయినట్లు టీడీపీ, బీజేపీ,వామపక్షాలు ఆరోపించాయి.రుయా ఆస్పత్రి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయా పార్టీల నాయకులను కూడ పోలీసులు అడ్డుకున్నారు.దీనిపై తాజాగా రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి స్పందిస్తూ ఆ రోజు ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని,ఆ ప్రభావంతో తర్వాత మరికొందరు మృతి చెందారని తెలిపారు.అందరి వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్ కోరడంతో మరో 12 మంది వివరాలు అందజేసినట్లు తెలిపారు.
ఈ దుర్ఘటనపై కాంగ్రెస్ నాయకుడు,మాజీ ఎంపీ చింతా మోహన్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా, బీజేపీ నాయకుడు భానుప్రకాష్రెడ్డి గవర్నర్కు లేఖ రాయడంతో పాటు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
Must Read ;- రుయా ఘటనపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు