న్యాయస్థానం తీర్పులంటే శిరోధార్యంగా భావించాల్సి ఉంటుంది. తీర్పుపై అభ్యంతరాలు ఉంటే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు అనేక అవకాశాలు ఉంటాయి. కానీ రాష్ట్రంలో పరిస్థితి మరోరకంగా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పులు, ఆదేశాలపై దుష్ప్రచారం జరుగుతోంది. న్యాయ వ్యవస్థను కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టుల పరంపర కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఇటీవల కాలంలో సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే దర్యాప్తు జరుగుతున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కేసును సీబీఐకు అప్పగించాలని సీఐడీని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తాజాగా సీబీఐ రంగంలోకి దిగనుంది. అందులో భాగంగా ఇప్పటికే నిందితులుగా గుర్తించిన వారిని సి.బి.ఐ విచారించే అవకాశం ఉంది. హైకోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన 17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుల్లో డి. కొండారెడ్డి, ఎ.మణి, పి.సుధీర్, ఆదర్శరెడ్డి, అభిషేక్ రెడ్డి, శివారెడ్డి, ఎ.శ్రీధర్ రెడ్డి, జె.వెంకట సత్యనారాయణ. జి. శ్రీధర్ రెడ్డి, లింగారెడ్డి, చందూరెడ్డి, శ్రీనాధ్, డి.కిషోర్ రెడ్డి, చిరంజీవి, ఎల్. రాజశేఖర్ రెడ్డి, గౌతమీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Also Read ;- న్యాయవ్యవస్థపై బురద : అనైతిక పోకడలు వైసీపీకే చేటు!
స్వయంగా ప్రభుత్వ పెద్దలే..
రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వ పెద్దలే ప్రెస్ మీట్ పెట్టి మరి హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా కోర్టుల పై ఉన్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా గతంలోనే పరిగణించిన న్యాయస్థానం సోషల్ మీడియాలో చెలరేగి పోతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరడంతో ప్రభుత్వం సిఐడి విచారణ చేపట్టింది. అది కాస్త నత్తనడకన, ఏకపక్షంగా సాగుతుండడంతో స్పందించిన న్యాయస్థానం సి బి ఐ విచారణకు ఆదేశించింది. న్యాయమూర్తులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఎంతమంది కటకటాల పాలవుతారో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం వీలైనంత త్వరగా తేల్చనుంది.
Aalso Read ;- ఇలా మాట్లాడితే విజయసాయి పరువే పోతుంది!