వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఏకాంబర అడవి ప్రాంతంలో జంతువులను వేటాడేందుకు వచ్చిన వేటగాళ్ల ను టాస్క్ ఫోర్స్, బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ల దగ్గర్నుంచి తుపాకులతో పాటు తొమ్మిది సెల్ ఫోన్లు, ఐదు బైకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జంతువులను వేటాడిన పదిమంది అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీళ్లంతా హైదరాబాద్, మహారాష్ర్టకు చెందిన వ్యక్తులు అని, ఇందులో కొడంగల్ మండలం బోయపల్లి తండాకు చెందిన ఆరు మంది, అలాగే కర్ణాటక రాష్ట్రం లింగంపల్లి గ్రామానికి చెందిన మరో నలుగురు వ్యక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీళ్లంతా రాత్రిపూట అడవుల్లో వేట కోసం వచ్చినట్టు, వీరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read:అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అరెస్ట్