పగ, ప్రతీకారం మామూలు మనిషిని నేరస్తుడిని చేస్తాయి. అదే ఒక నేరస్తుడికే పగ, ప్రతీకారం ఓ రేంజ్లో ఉంటే.. పైగా అతగాడికి చేతిలో అధికారం ఉంటే.. ఇక దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. సరే ఆ కాన్సెప్ట్ పక్కన పెడదాం. ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? అడవిలో జరగాల్సిన వేట.. రాజకీయాల్లో జరుగుతున్నట్లు అనిపించడం లేదూ. ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా ఆ వేట కొనసాగుతూనే ఉంది. ఆ వేట వల్ల రాష్ట్రం నష్టపోయినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. పోనీ ఆ వేట అయినా సరిగా చేసి.. ముగిస్తారా అంటే అదీ లేదు.
అమరావతి కుంభకోణం అంటూ..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో గెలవగానే.. ప్రమాణస్వీకారం కూడా చేయక ముందే ఢిల్లీలో అమరావతి గురించి అడగగానే చెప్పిన మాట ఒకటే.. అది ఒక కుంభకోణం అని. అప్పటి నుంచి ఇప్పటివరకు అమరావతి పేరును కూడా ఉచ్చరించలేదు.. కావాలంటే ఎవరైనా గమనించండి. అది అధికారిక సమావేశం అయినా.. పార్టీ సమావేశం అయినా సరే.. ఆ పేరు కూడా ఎత్తలేదు. జాతీయ ఛానెళ్లలో కూడా అమరావతి గురించి అడగగానే.. ఇట్స్ ఎ బిగ్ స్కామ్ అన్నాడు.. అదొక క్విడ్ ప్రోకో అన్నాడు తప్పితే.. ఆ సమాధానంలో కూడా అమరావతి పేరు ఎత్తలేదు.
ఆగని దాడి..
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి జగన్ ఆరోపిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అదే మాట చెప్పారు. విచారణ చేసుకోమని టీడీపీ వాళ్లు సవాల్ విసిరారు. మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ తర్వాత సిట్ అని.. సీఐడీ అని రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరకు ఏమీ దొరకలేదు. అయినా ఆరోపణలు ఆపలేదు.. ఆ దాడి ఆపలేదు.
ప్రధాన న్యాయమూర్తి కాకుండా చేయాలని..
చివరకు ఏకంగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తినే టార్గెట్ చేశారు. ఆయన కుటుంబం అక్కడ భూములు కొంది కాబట్టి.. స్కామ్లో ఆయన కూడా ఉన్నట్లు చిత్రీకరించి.. దాని మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక కంప్లయింట్ లెటర్ రాశారు. అందులో హైకోర్టు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని.. దీని వెనక ఆ న్యాయమూర్తి ఉన్నట్లు ఆరోపించారు. న్యాయవ్యవస్ధ మీద ఆరోపణలు చేసినప్పుడు.. ప్రైవసీ మెయిన్ టెయిన్ చేసి.. అంతర్గత విచారణ చేస్తారు.. కాని కేరెక్టర్ అసాసినేషన్ చేయాలనుకున్న జగన్.. ఆ లెటర్ను బహిరంగపర్చి.. నైతికంగా దెబ్బ తీయాలని చూశారు. ఇదంతా ఆ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తి కాకుండా చేయాలని.. ఒక వేళ అయితే.. తాను జైలుకెళ్లక తప్పదనే భయంతోనేనని జనం చెప్పుకున్నారు. కాని ఇప్పుడాయన ప్రధాన న్యాయమూర్తి అవుతున్నారు.
చంద్రబాబును జైలుకు పంపాలనుకుని..
ఈలోపే.. చంద్రబాబును జైలుకు పంపాలని మరో స్క్రిప్ట్ రాశారు.. అదే దేవుడి స్క్రిప్ట్. కాని అది కూడా ఫెయిలైంది. ప్రభుత్వంలో ఉండి.. పోలీసులు, వ్యవస్ధ చేతిలో ఉన్నా.. ఒక కేసు కూడా సరిగా పెట్టలేకపోయారంటే.. అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. ఇదంతా పగ తీర్చుకోవాలనే ఆత్రంతో చేస్తున్న తప్పులే తప్ప.. మరోటి కాదు. మరి ఈ ట్రెండ్ ఇంకెన్నాళ్లు నడుస్తుందో.. ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.
Must Read ;- ఇలా జరుగుతుందని తెలిసే.. జగన్ అలా చేశారా?











