అమరావతి రాజధానిలో చివరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ, జనసేన కూటమి అండగా నిలుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం ఢిల్లీలో వ్యాఖ్యలు చేశారు. నడ్డా కూడా తనతో అదే సంగతి చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కూడా పూర్తిగా కేంద్రానిదే అని కూడా నడ్డా తనతో అన్నట్టుగా వపన్ వెల్లడించారు.
అంతా బాగానే ఉంది.. ఈ రెండు మాటలు చెప్పడానికి పవన్ కల్యాణ్, తన సలహాదారు నాదెండ్ల మనోహర్ ను కూడా వెంటబెట్టుకుని ఢిల్లీకివెళ్లడం ఎందుకో అర్థం కావడం లేదు. ఈ విషయాల్ని బీజేపీ తొలినుంచి చెబుతూనే ఉంది. మరి జనసేనాని హస్తినాపురానికి వెళ్లి కొత్తగా చెప్పిన సంగతి ఏమిటి?
రాజధాని రైతులకు న్యాయం చేస్తామంటున్నారేగానీ, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకేఒక రాజధానిగా ఉంటుందని పవన్ కల్యాణ్ అనడం లేదు. అలాంటి హామీ ఆయన పుచ్చుకున్నట్టుగా గానీ, నడ్డా ఇచ్చినట్టుగా గానీ లేదు. ఒక రాజధాని మాత్రమే ఉండాలని జనసేనాని డిమాండ్ చేసినట్టు కూడా లేదు. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు రాజధానిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడి రాజధాని అమరావతికి బీజేపీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే విషయం కూడా జనానికి అర్థం కాకుండా చేశారు. ఇక అదేబాటలో జనసేనాని కూడా పయనిస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని రైతులకు న్యాయం చేయడం అంటే ఏమిటి? ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తారా? లేదంటే వైసీపీ ప్రభుత్వంతో చర్చించి రైతుల ప్లాట్లు ఇప్పిస్తారా? అనే స్పష్టత లేదు. ‘రైతులకు న్యాయం చేయడం’ అంటే అమరావతిలోనే ఒకే ఒక రాజధాని కొనసాగేలా చూడటం మాత్రమేనని జనసేనాని గుర్తెరగాలి.
Must Read ;- టీవీని ఎక్కిదిగిన జనసేనాని పవన్ కల్యాణ్
పోలవరం ఖర్చు కేంద్రమే భరించాలి
ఇక రెండవ కీలక అంశం ఏపీ జీవనాడి, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా కేంద్రమే భరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరామని తెలిపారు. బాధ్యత కేంద్రానిదే అని చెప్పినట్టు కూడా వెల్లడించారు.
తిరుపతిలో ఎవరు పోటీ చేయాలి?
తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అయితే అక్కడ బీజేపీ అభ్యర్థిని నిలపాలా, లేక జనసేన అభ్యర్థిని నిలపాలా అనేది వారిష్టం. తిరుపతిలో ఎవరు గెలిచారు అనేదానిపై రాష్ట్ర ప్రయోజనాలు ఆధారపడి ఉండవు. ఇది వారి పార్టీ అంతర్గత వ్యవహారం. దీనిపై చర్చోపచర్చలకు ఆస్కారం లేదు. ఈ విషయం కూడా ప్రస్తుతానికి తేలలేదు. రెండు పార్టీల వారితో ఒక కమిటీ వేస్తామని.. ఆ కమిటీ చర్చించి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని పవన్ చెప్పారు.
ఢిల్లీ ఎందుకు వెళ్లారో మీకే తెలియాలి సాబ్
బీజేపీ అధినేతను, జనసేనాని కలవబోతున్నారని రెండు రోజులుగా మీడియాలో తెగ కథనాలు వచ్చాయి. ఏపీకి ఏదైనా సాధిస్తారేమోనని అందరూ భావించారు. చివరకు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే జనసేనాని అనేకసార్లు చెప్పిన విషయాన్ని, ఢిల్లీలో మరోసారి చెప్పారు. అంతే. అందులో కొత్త అంశాలు లేవు. ఇక అమరావతి రాజధానిపైగాని, పోలవరంపైగాని జనసేనాని ఢిల్లీలో కూడా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవడానికి, వారు రాజకీయ ఉపన్యాసాలు చేయడానికి ఉపయోగపడతాయి తప్ప, ఏపీ ప్రజలకు ఒరిగేదేమీ లేదు.
Major issues came for discussion with National BJP President Shri @JPNadda ji , in today’s meeting in Delhi.
• BJP & JSP will stand with every
Amaravati farmer unti they get
justice in their struggle . pic.twitter.com/skfOOjkyo2— Pawan Kalyan (@PawanKalyan) November 25, 2020
Also Read ;- నవ్యాంధ్ర రాజధాని అమరావతి వాస్తు.. వాస్తవాలు











