టాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది పూజా హెగ్డే. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’, అలాగే అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాలను చేస్తోంది. ఈమధ్యనే ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటలీ వెళ్లొచ్చిన ఆమె గత వారం రోజుల నుండి ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. వరుసగా సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న పూజా హెగ్డే ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒకదశలో సృహ కోల్పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయట.
వెంటనే ఆమెను హాస్పటల్ కు తీసుకువెళ్లగా అక్కడ ఉన్న డాక్టర్ల సలహా మేరకు పూజకు కరోనా టెస్టులు చేయించగా… అందులో కరోనా నెగిటివ్ అని రావడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుందట. డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ముంబయి వెళ్లిపోయింది పూజా హెగ్డే. అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుందట. అంతేకాకుండా ఈ నెల చివరి నుండి పూజా ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది.
అసలు ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ అనేక కారణాలతో ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఏదిఏమైనా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకనే పూజా హెగ్డే విశ్రాంతి తీసుకున్న వెంటనే ఈ సినిమా చేయాలని ఇప్పటికే ఆమెకు దర్శకనిర్మాతలు చెప్పారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. విశ్రాంతి అనంతరం పూజా హెగ్డే ఏ సినిమా షూటింగ్ కు హాజరవుతుందో చూడాలి మరి.
Must Read ;- కరోనా గిరోనా జాన్తానై అంటున్న రష్మిక?