సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ట దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం ఎట్టకేలకు పట్టాలకెక్కింది. ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం జరిగింది. ముహూర్తపు సన్నివేశాన్ని హైదరాబాద్ కేపీహెచ్ బీ లోని కాశీవిశ్వనాథ టెంపుల్ తీశారు. మహేష్ బాబు గారాల పట్టి సితార క్లాప్ కొట్టగా, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేశారు. ఎస్. ఎస్. తమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. జనవరి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు కూడా నటిస్తున్నారు. దీనికి కెమెరా మధి, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్, కళ ఏఎస్. ప్రకాష్. నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Must Read ;- అంజలి అంజలి అంజలి.. పున్నమి జాబిలిలా మెరిసిన అర్హ
అనుష్క కు చోటుందా?
ఈ సినిమాలో అనుష్క ఓ పాత్రను పోషించబోతోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ బ్యాంక్ ఆఫీసర్ గా అనుష్క నటించబోతున్నట్లు సమాచారం. సినిమా వర్గాలు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. అమెరికాలో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యం, ఇతర విశేషాలను గోప్యంగా ఉంచుతున్నారు. 2021లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందంటే వచ్చే సంక్రాంతికి విడుదల ఉంటుందా లేదా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే.