కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ – 2’. ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్ లో క్లైమాక్స్ ఫైట్స్ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్. ఈ ఫైట్స్ లో యష్, సంజయ్ దత్ పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పై ట్వీట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్. ‘అధిరా మీద తీస్తున్న ఫైట్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయి. డెడ్లీ ఫైట్ మాస్టర్స్ తో క్లైమాక్స్ ప్లాన్ చేశాను. షూటింగ్ లో సంజయ్ దత్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు’ అని ట్వీట్ చేశాడు.
ఈ ఒక్క ట్విట్ తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ‘కేజీఎఫ్’ మొదటిభాగం అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. యష్ స్టామినాను అమాంతం పెంచేసిన సినిమా ఇది. దాంతో ‘కేజీఎఫ్ – 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి టీజర్ కోసం యష్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.
అత్యంత భారీ వ్యయంతో హోంబలే ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మరి క్లైమాక్స్ ఫైట్ కేజీఎఫ్ 2 కు ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.
Must Read ;- సలార్ స్టోరీ బయటపెట్టిన ప్రశాంత్ నీల్
Climax it is !!!!
Rocky ⚔ Adheera
With the deadly fight masters anbariv…..#KGFCHAPTER2 pic.twitter.com/QiltJiGQgl— Prashanth Neel (@prashanth_neel) December 7, 2020