వినేవాడుంటే చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు. పైగా కొడాలి నానిలాంటోడు అయితే.. అరిచి మరీ చెబుతాడు. అబద్ధాన్ని అరిచి చెబితే.. అది నిజమైపోతుందని వారి నమ్మకం. కళ్లుండి చూసినోళ్లు.. చెవులుండి విన్నోళ్లు.. అన్నీ ప్రత్యక్షంగా అనుభవించనోళ్లు అందరూ పిచ్చోళ్లని నాని అభిప్రాయం. అందుకే జగన్ అలా ఆర్డర్ ఇవ్వగానే ఇలా మీడియా ముందుకొచ్చి చెలరేగిపోయాడు.
కేసీఆర్ ఆయన గొప్పదనం చెప్పుకోవడానికి..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన గొప్పదనం చెప్పుకోవడం కోసం.. ఏపీని ఎగతాళి చేశాడు. ఏపీని అనేకంటే ఏపీలో పరిస్ధితులను అనొచ్చు. అవసరం లేకుండా కేసీఆర్ ఏ స్టేట్ మెంట్ ఇవ్వడు. ఏదో అలా అలవాటులో పొరపాటున మాట్లాడటం అనేది ఆయన చరిత్రలో లేదు. ఇది కూడా అంతే. జస్ట్ తెలంగాణలో తన పొజిషన్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం.. తెలంగాణ ప్రజలకు తనపై పోతున్న నమ్మకాన్ని మళ్లీ రెయిజ్ చేయడం కోసం ఈ డైలాగ్ వదిలానడంలో సందేహం లేదు. ఒక ఎకరం ఇక్కడ అమ్మితే.. ఏపీలో రెండు ఎకరాలు కొనే పరిస్ధితి వచ్చిందని.. ఒకప్పటి పరిస్ధితి రివర్స్ అయిందని కేసీఆర్ అనగానే.. ఏపీలో రాజకీయ దుమారం రేగింది.

ఇదంతా జగన్ వల్లేనంటూ..
చూశారా.. మన పరిస్ధితి… ఇదంతా జగన్ వల్లేనని చంద్రబాబు అండ్ కో విమర్శించడం మొదలెట్టారు. ఇప్పుడు దానిని కౌంటర్ చేయడం కోసం కొడాలి నాని రంగంలోకి దిగాడు. వీళ్లకేం తెలుసు.. హైదరాబాద్లో కాపురం ఉండేవాళ్లు అంటూ రెచ్చిపోయాడు. అంతే కాదు.. కేసీఆర్ అన్న మాట నిజమే అని ఒప్పుకుంటున్నట్లే మాట్లాడాడు. కాని ఆ పరిస్ధితికి కారణం చంద్రబాబేనని బుకాయించాడు. చంద్రబాబు మొత్తం అమరావతిలో ఫోకస్ చేయబట్టే.. మిగిలిన జిల్లాలన్నీ నాశనం అయిపోయాయని.. అక్కడ రేట్లు పడిపోయాయని ఆరోపించాడు. దానిని సరి చేయడానికే మూడు రాజధానుల ముచ్చట తెచ్చినట్లు.. అదీ కూడా చేయనివ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నాడని విరుచుకుపడ్డాడు.
అసలు సంగతి ఏంటంటే..
అసలు సంగతి ఏంటంటే.. చంద్రబాబు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగానే ఉంది.. రియల్టర్లు అంతా మళ్లీ చంద్రబాబే గెలవాలని బలంగా కోరుకున్నారు కూడా. కాని బాబు ఓడిపోవడంతో.. అమరావతి అటకెక్కింది. అంతే అన్నీ డౌన్ అయ్యాయి. ఇక జగన్ సామి ఇసుక పాలసీ అంటూ కొత్త ఫిటింగ్ పెట్టి.. రియల్ ఎస్టేట్ను మరింత తొక్కాడు. ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా అంతా కుప్పకూలింది. చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతిలోనే ఫోకస్ అంటారనే.. రాయలసీమలో ఫ్యాక్టరీలు.. విశాఖలో ఐటీ.. అలా ప్లాన్ చేశాడు. అందుకే అన్ని చోట్ల హోప్స్ పెరిగాయి. కాని జగన్ వచ్చాక.. అవన్నీ కుప్పకూలిపోయాయి. రాజధాని తరలింపు, రివర్స్ టెండరింగ్ ఇవే అజెండాగా మారిపోయాయి. ఇన్వెస్టర్లు రావడానికే భయపడిపోతున్నారు. ఘోరంగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వల్లే కేసీఆర్ చెప్పిన పరిస్ధితి వచ్చింది.
ఇవన్నీ పక్కన పెట్టి.. చంద్రబాబు ఉన్నప్పుడే రేట్లు పడిపోయినట్లు.. బాబే అంతా చేసినట్లు కొడాలి నాని బీభత్సంగా అరుస్తూ ఊగిపోతూ నాటకమాడాడు. నష్టాల్లో కూరుకుపోయిన రియల్టర్లకు తెలియదా… ఫ్లాట్లు బుక్ చేసి అడ్వాన్స్ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసిన కస్టమర్లకు తెలియదా.. ల్యాండ్స్ కొని.. ఆ రేటుకు కూడా అమ్మలేక..ఉంచుకోలేక నానా బాధలు పడుతున్న జనానికి తెలియదా.. ఎవరికీ తెలియదు కొడాలి నాని.. రేట్లు ఎవరివల్ల పడిపోయాయో.. ఎంత గొంతు చించుకుని అరిచినా వాస్తవాలు మారవు కొడాలి నాని.
Also Read:మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్ఈసీ ఆదేశం











