టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు‘. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందణ్ణ హీరో, హీరోయిన్లగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంతటి ఘన విజయం సాధించిన సినిమాను కోలీవుడ్ లో ‘ఇవనుక్కు సరియాన ఆళిల్లై’ గా అనువదించి రిలీజ్ చేశారు.
కరోనా కారణంగా దాదాపు ఏడు నెలల పాటు దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవల సినిమా థియేటర్స్ ను ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా థియేటర్ల యజమానులు ముందుకు రాలేదు. అందుకు కారణం కరోనా ఇంకా తగ్గకపోవడమే. థియేటర్లకు ప్రేక్షకులు అప్పుడే వచ్చే ధైర్యం చేయరని భావించారు. పైగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం థియేటర్స్ నడిపితే భారీగా నష్టం వస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పటికైనా థియేటర్స్ ఓపెన్ చేయాలని అదేదో కరోనా తగ్గుతున్న సమయంలో తెరిస్తే బాగుటుందని కోలీవుడ్ లో కొందరు డిస్టిబ్యూటర్లు ఒక నిర్ణయానికి వచ్చారు.
కాని ఈ సమయంలో కోలీవుడ్ లో ఏ పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేదు. అందుకు కారణం అన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. అందుకే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను తమిళనాడులో రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు భావించారు. వెంటనే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసి సినిమాను సరిగ్గా ఈ రోజే రిలీజ్ చేశారు. మొదట ఈ సినిమాను 170 స్క్రీన్ లలో విడుదల చేద్దామని అనుకున్నారు కాని క్రమంగా ఆ సంఖ్య 220కి చేరింది. ఇది మహేష్ బాబు కెరీర్ లోనే సాలిడ్ రిలీజ్ అని చెప్పాలి. మహేష్ బాబు కు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. మరి ఈ సినిమా తెలుగులో మాదిరిగానే తమిళ్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందో లేదో చూడాలి.
Must Read ;- ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా కన్నడ కస్తూరి