విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ సినిమా అసురన్ కి రీమేక్. సురేష్ బాబు, కలై పులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించిన నారప్ప చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ.. ఫైనల్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 20న నారప్ప సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే.. ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం ద్వారా సురేష్ బాబు భారీ లాభాలే దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ నారప్ప ఎంతకి అమ్మారో తెలుసుకుందాం. నారప్ప చిత్రానికి ఏకంగా 40 కోట్ల రూపాయల్ని దక్కించుకున్నారు మేకర్స్. ఇక్కడితో ఈ సినిమా రాబడి ఆగిపోలేదు. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలకు అదనపు లాభం చేకూరుతుంది. ఈ కరోనా కష్టకాలంలో నారప్పను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇంత కలెక్ట్ చేస్తుందా అనేది అనుమానమే. ఇక వెంకీ నటించిన మరో సినిమా దృశ్యం-2. ఇది మలయాళం రీమేక్. ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి మొత్తం హక్కుల్ని (డిజిటల్, శాటిలైట్, డైరక్ట్ ఓటీటీ రిలీజ్) 36 కోట్ల రూపాయలకు అమ్మేశారు. దృశ్యం-2 సినిమాని కేవలం నెల రోజుల్లో పూర్తి చేశారు. ఈ సినిమాను 36 కోట్లకు అమ్మారంటే.. చాలా మంచి డీల్. మొత్తానికి రెండు రీమేక్ సినిమాలను భారీ మొత్తానికి అమ్మేసి భారీగా లాభాలు అందుకున్నారు సురేష్ బాబు.
Must Read ;- వెనక్కి తగ్గిన వెంకీ.. ఇంతకీ ఏమైంది..?