ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. సంవత్సరం పైగా దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి వ్యాక్సినేషన్ లాంఛనంగా మొదలవబోతుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు కో-విన్ యాప్ను కూడా ప్రారంభించనున్నారు. జనవరి 16వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో మోడీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. తొలిరోజున దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి అందించనున్నట్లు తెలుస్తుంది. దేశంలో 3000 కేంద్రాల్లో.. ఒక్కో కేంద్రంలో 100 మందికి అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ అనంతరం వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షణలో పెట్టనున్నారు. దేశం నలుమూలలకు కోటీ 65 లక్షల టీకాలు చేరాయి.
వ్యాక్సిన్ పై అనుమానాలు నివృత్తి చేయడానికి 24 గంటలూ నిరంతరాయంగా పనిచేయడానికి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీనితోపాటు 1075కి ఫోన్ చేసి కూడా అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపింది. కొద్దిరోజుల పర్యవేక్షణ చేసిన తర్వాత కేంద్రాలను 5000 వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
Must Read ;- కరోనా అంతానికి ఒకే డోసు టీకా : ప్రయోగాలు సఫలం!
కర్మాచారికే తొలి టీకా
తెలంగాణలో తొలి టీకాను ప్రభుత్వ దవాఖానాలో పనిచేస్తున్న కర్మాచారికి ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా కష్టకాలంలో అతను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవాన్ని ఆయనకి అందించాలని ప్రభుత్వం నిర్ణియంచిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 139 కేంద్రాల్లో.. ఒక్కో కేంద్రంలో కేవలం 30 మందికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఆపై 50.. 100.. ఇలా పెంచుకుంటూ పోవాలని ప్రభుత్వం నిర్ణియించింది. వీటితోపాటు టీకా కేంద్రాలను కూడా పెంచనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మొత్తంగా 3.30 లక్షల మందకి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొదటి వారంలో కేవలం ప్రభుత్వ రంగ కేంద్రాల్లో మాత్రమే టీకా అందించి.. ఏ సమస్యలు తలెత్తకపోతే.. రెండో వారం నుండి ప్రైవేటు కేంద్రాల్లో కూడా టీకా అందించే ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు హైదరాబాద్ జిల్లా పరిధిలో 18,070 మందికి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 3,270 మందికి, నిజామాబాద్ జిల్లాలో 3,020 మందికి, వరంగల్రూరల్ జిల్లాలో 2,640 మందికి, ఆదిలాబాద్ జిల్లాలో 2,370 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
ఏపీలో వ్యాక్సినేషన్ సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తంగా 4 లక్షల 99 టీకా డోసులు రాష్ట్రానికి చేరినట్లు తెలుస్తుంది. అందులో 4 లక్షల 77 వేలు, 22 వేల డోసులు భారత్ బయోటెక్కి టీకాలు చేరుకున్నాయి.
Also Read ;- ప్రజలపై కరోనా సెస్సు .. ‘పన్ను’ పీకుతారట!