Police Complaint Against Niharika Husband Chaitanya :
సినిమా నటుడు నాగబాబు అల్లుడు జొన్నలగడ్డ చైతన్య ఏం చేశాడు? అసలు ఆ అపార్ట్ మెంట్ లో ఏం జరుగుతోంది? అపార్ట్ మెంట్ వాసులు, చైతన్య పరస్పరం కేసులు పెట్టుకొనేదాకా పరిస్థితి ఎందుకు వెళ్లింది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి అపార్ట్ మెంట్ వాసులతో చైతన్యకు గొడవ జరిగినట్లు సమాచారం. కొందరు యువకులు మద్యం సేవించి హల్ చల్ చేయడంతో అపార్ట్ మెంట్ వాసులు అభ్యంతరం తెలిపారని, ఆ యువకులు చైతన్యకు స్నేహితులు కావడం, వారికి చైతన్య వత్తాసు పలకడం తో గొడవ తీవ్రస్థాయికి చేరినట్టు తెలుస్తోంది.
నాగబాబు కుమార్తె నిహారికతో జొన్నలగడ్డ చైతన్య వివాహం గత ఏడాది జరిగిన సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యది గుంటూరు. చైతన్య తండ్రి ప్రభాకరరావు గుంటూరు రేంజ్ ఐజీ అన్న సంగతి తెలిసిందే. వివాహం జరిగిన తర్వాత చైతన్య హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. బంజారాహిల్స్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. అతను మంచి ఫొటోగ్రాఫర్. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ గొడవ జరగడంతో బంజారాహిల్స్ పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అపార్ట్ మెంట్ లో తరచూ పార్టీలు జరుగుతూ ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తరచూ ఇలా జరగడం వల్లే అపార్ట్ మెంట్ వాసులు తిరగబడినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మీడియాలో వార్తలు రావడం సంచలనమైంది. ఎవరో ఒకరు ఇరుపక్షాలకు సర్దిచెప్పి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. ఈ వ్యవహారం చైతన్య కుటుంబ పెద్దల దృష్టికి కూడా వెళ్లింది. రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మీడియాలో రచ్చ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న విషయానికే ఇంత రాద్దాంతం చేస్తున్నారని అంటున్నారు. మందు పార్టీ విషయంలో గొడవ జరగలేదని, ఆఫీస్ పెట్టడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే గొడవ జరిగిందన్న కొత్త వాదన తెరపైకి వచ్చింది. పెద్దల రంగ ప్రవేశంతో పోలీసులు ఇరువర్గాలకూ రాజీ కుదిర్చారు.
Must Read ;- ‘మా’ వెనక ఎవరు?.. సొంత భవనం ఎప్పుడు?