పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. దీని సినిమా తర్వాత విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ తో సినిమా చేయనున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. జనవరిలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలా అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ వచ్చింది. దీనికి యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు.
సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వీటితో పాటు సురేందర్ రెడ్డితో ఓ మూవీ, హరీష్ శంకర్ తో ఓ మూవీ చేయనున్నాడు. కొరియాగ్రఫర్ జానీతో కూడా మూవీ ప్లాన్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్.. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఓ సినిమా చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పూరితో సినిమా చేయడానికి ఓకే చెప్పారని.. త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే.. పవన్ హరీష్ తో మూవీ, సురేందర్ రెడ్డితో మూవీని ఎనౌన్స్ చేసారు కానీ.. పూరితో సినిమాని ఎనౌన్స్ చేయలేదు.
దీంతో పవన్ – పూరి ప్రాజెక్ట్ లేదనుకున్నారు. ఇప్పడు ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మహేష్ తో పూరి చేయాలనుకున్న జనగణమన కథనే పవన్ కళ్యాణ్ కి చెప్పారట. ఇందులో దేశంలో ఉన్న అవినీతి.. దానిని ఎలా అంతం చేయాలి..? ఎలాంటి చట్టాలు రావాలి.? ప్రజల్లో ఎలాంటి మార్పులు రావాలి.? తదితర విషయాలు సీరియస్ గా చెప్పనున్నారట పూరి. ఈ కథ చెప్పగానే పవన్ కళ్యాణ్ వెంటనే ఓకే చెప్పారట. అయితే.. ఈ మూవీని 2022లో సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారని సమాచారం.
పూరి పవన్ తో ‘బద్రి, కెమెరామేన్ గంగతో రాంబాబు’ సినిమాలు తెరకెక్కించారు. బద్రి సూపర్ డూపర్ హిట్ కాగా ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ యావరేజ్ గా నిలిచింది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయనున్నారని వార్తలు వచ్చినప్పటి నుంచి అటు పవన్ అభిమానులు ఇటు పూరి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి.. పవన్ – పూరి మూవీ సెట్ అయితే.. ఫ్యాన్స్ కి ఫెస్టివలే..!
Must Read ;- పవన్ వెర్సెస్ ప్రకాష్ రాజ్.. టెన్షన్ లో దిల్ రాజు.?