ఎనర్జిటిక్ హీరో రామ్ ఎప్పటి నుంచో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆఖరికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రామ్ ని ఫుల్ మాస్ అవతారంలో ఇస్మార్ట్ శంకర్ గా చూపించారు. ఇస్మార్ట్ శంకర్ గా రామ్ యాక్టింగ్ అదరగొట్టేశాడు. అంతే.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రామ్ మాస్ ని మెప్పించాలనే కోరిక నెరవేరింది. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలని ఆలోచించి రామ్ చేసిన సినిమా రెడ్. ఈ చిత్రానికి నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
రెడ్ మూవీని ఈ సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా కుదరలేదు. ఆతర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్ ఇచ్చాయి. దీంతో రెడ్ మూవీ కూడా ఓటీటీలో రానుందని గట్టిగా వినిపించింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఆ వార్తలను రామ్ ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోను రెడ్ మూవీని థియేటర్లోనే రిలీజ్ చేస్తానని ప్రకటించారు. డిసెంబర్ నుంచి థియేటర్లు ఓపెన్ చేయడంతో సంక్రాంతికి రెడ్ థియేటర్లోకి రావడం ఖాయం అనుకున్నారు.
అయితే.. జనాలు థియేటర్లకు వస్తారా.? సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తే.. ఆశించినట్టుగా కలెక్షన్స్ వస్తాయా..? రావా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మాస్ మహారాజా రవితేజ మాత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న క్రాక్ మూవీని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో రామ్ రెడ్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలా.? వద్దా..? అని ఎటూ తేల్చుకోలేక డైలమాలో ఉన్నాడట. తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతికి కాకుండా సమ్మర్ కి రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట. మరి.. రామ్ త్వరలోనే రెడ్ రిలీజ్ పై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Must Read ;- ఆరు సినిమాలతో రామ్ ఖాతాలోకి కొత్త రికార్డ్