జగన్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు కొత్తేమీ కాదు. కానీ, రాష్ట్రంలో రావణకాష్టంలా రగులుతున్న ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి మధ్య స్థానిక పంచాయితీ సుప్రీంకు చేరింది. స్థానిక ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఆ పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దాన్ని సరిచేసి వేయాలని సుప్రీం సూచించింది.
ఈ క్రమంలో.. పిటిషన్ ను తిరిగి ఇచ్చేసింది. ఈ పిటిషన్ ను సరిచేసి మళ్లీ ఈ రోజే దాఖలు చేయడం సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వ లాయర్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో.. సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ముందుగా ప్రకటించిన విధంగా.. పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ మాత్రం ఈ ఆదివారమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం మళ్లీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేనట్టేనని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
Must Read ;- ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల











