యంగ్ హీరో నితిన్ లాస్టియర్ ‘భీష్మ’ చిత్రంతో సాలిడ్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఎప్పటి నుంచో సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తోన్న నితిన్ కి ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఒక్కసారిగా ఉత్సాహాన్నిచ్చింది. దాంతో మిగిలిన చిత్రాల్ని మరింత స్పీడ్ గా పూర్తి చేస్తూ తన కెరీర్ గ్రాఫ్ పెంచుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి తాజా చిత్రం ‘రంగ్ దే’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.
గిమ్మీ సమ్ లవ్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ వెరైటీ లవ్ స్టోరీకి వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొన్న విషయాన్ని మేకర్స్ .. ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాగే.. ఈ సినిమాను హోలీ కానుకగా.. మార్చ్ 26న విడుదల చేయబోతున్నారు.
కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోన్న ‘రంగ్ దే’ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన సింగిల్స్ .. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పీ.డీ. వీ ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ‘రంగ్ దే’ సినిమా నితిన్ కు ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Must Read ;- చెక్ తో నిజమైన నటన నేర్చుకున్నాను: నితిన్
It’s a wrap for the shoot of #RangDe.
Arriving this Holi to entertain with the colors of love! #RangDeOn26thMarch @actor_nithiin @KeerthyOfficial @pcsreeram @thisisdsp @dirvenky_atluri @vamsi84 @adityamusic @SVR4446 @ShreeLyricist @NavinNooli pic.twitter.com/JdAI7VWlzK— BARaju (@baraju_SuperHit) February 24, 2021