ఫిబ్రవరి 12న విడుదలైన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’ .. టాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో ఊసేసిందో తెలిసిందే. రికార్డు స్థాయి కలెక్షన్స్ కురిపించి.. సినిమా రూ. 100కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అలాగే.. ఈ సినిమా అఖండం విజయంతో తొలి చిత్రంతోనే తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు హీరో వైష్ణవ్ తేజ. అలాగే.. అది తన తొలి చిత్రమైనా.. ఎలాంటి తడబాటూ లేకుండా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని అద్భుతంగా తెరమీద ఆవిష్కరించాడు దర్శకుడు బుచ్చిబాబు సాన.
అందుకే ఉప్పెన సినిమా అఖండ విజయాన్ని పురస్కరించుకొని మైత్రీ మూవీ మేకర్స్ వారు.. బుచ్చిబాబు సానాకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చారు. సుమారు రూ. 60లక్షలకు పైగానే విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ జీయల్సీ కారును బుచ్చిబాబుకు అందించారు . దాంతో తన గురువైన సుకుమార్ తో ఆ కార్ లో ఫస్ట్ రైడ్ కు వెళ్ళారు దర్శకుడు బుచ్చిబాబు. అంతేకాదు .. బుచ్చిబాబు.. త్వరలో మైత్రీ మూవీస్ లో మరో సినిమా చేయబోతున్నాడని వినికిడి.
Must Read ;- బుచ్చిబాబు ‘మెగా’ హృదయాలను అంతలా కోసేశాడా?











