ప్రభాస్ అభిమానులంతా కూడా ‘సంక్రాంతి’ కానుకగా ‘రాధేశ్యామ్‘ నుంచి టీజర్ రావొచ్చునని భావిస్తున్నారు. అందుకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దర్శక నిర్మాతలెవరూ సంక్రాంతికి టీజర్ ను వదులుతామని చెప్పలేదు. కానీ త్వరలో సర్ ప్రైజ్ ఉంటుందని మాత్రం అన్నారు. దాంతో ‘సంక్రాంతి’ కానుకగా ‘రాధేశ్యామ్’ నుంచి టీజర్ వదిలే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఇతర సినిమాలకి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కనీసం కొత్త పోస్టర్ నైనా రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘రాధే శ్యామ్‘ నుంచి టీజర్ వదులుతారనే నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ రిలీజ్ చేసే ఉద్దేశమంటూ ఉంటే రేపు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంటుంది. సంక్రాంతి కానుకగా రేపు విడుదల చేస్తారా? లేదా? అనేది చూడాలి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే అలరించనుంది. ఇటు ప్రభాస్ .. అటు పూజా హెగ్డే ఇద్దరూ కూడా మంచి హైట్. ఆకర్షణీయమైన ఈ జంటను స్క్రీన్ పై చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు.
పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథకు, జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించాడు. దర్శకుడు రాధాకృష్ణకుమార్ విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు. ప్రతిపాటను మంత్రముగ్ధులను చేసేలా చిత్రీకరిస్తున్నారట. ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ‘సాహో’ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయమనేది అభిమానుల మాట.
Must Read ;- ప్రభాస్ విలన్ గా జాన్ అబ్రహం.. ఏ సినిమా?