‘లింగ వివక్ష’ అస్త్రంతో అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు నుంచి పదవీ వీచ్యుతుడిని చేయాలని వైసీపీ సర్కారు పావులు కదపుతున్నట్లు తెలుస్తోంది. అశోక్ను తప్పించేందుకు మన్సాస్లో అక్రమాలంటూ ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు ‘లింగ వివక్ష’ అంశాన్ని కూడ తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. మన్సాస్ ట్రస్టుపై కన్నేసిన వైసీపీ సర్కారు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే..
హైకోర్టు తీర్పుతో..
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వ్వవహారం వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతోంది. గతేడాది మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్ధానంలో ఆనందగజపతిరాజు కుమార్తె సంచైతను కూర్చోబెట్టిన వైసీపీ సర్కార్కు హైకోర్టు తీర్పుతో షాక్ తగిలింది. హైకోర్టు తీర్పుతో తిరిగి మాన్సాస్ ఛైర్మన్ అయిన అశోక్ను తిరిగి తొలగించేందుకు ప్లాన్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాన్సాస్లో అమల్లో పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. శబరిమల దర్శనం విషయంలో మహిళలకు కూడా సమాన హక్కు ఉందంటూ సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. శబరిమలలో లింగ వివక్ష చెల్లదని పేర్కొంది. అలాగే మిగతా ఆలయాల్లోనూ మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ తీర్పుల్ని ఆధారంగా చేసుకుని మాన్సాస్ నుంచి అశోక్ గజపతిరాజుకు ఉద్వాసన పలకాలని వైసీపీ సర్కార్ యోచిస్తోంది. అందుకు మహిళా కమిషన్ను సైతం పావుగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైకోర్టు తీర్పు తర్వాత తొలిసారిగా బయటికొచ్చిన సంచైత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిశారు.
Must Read ;- రాజు గారి ఫైరింగ్.. ఆ ‘కుక్క కాపలా‘ ఏంటీ?
వైసీపీ ప్రభుత్వం మీదే ఆధారపడుతున్న సంచైత
హైకోర్టు తీర్పుతో మాజీ అయిన సంచైత సొంతంగా న్యాయపోరాటం చేయడం కంటే వైసీపీ ప్రభుత్వం మీదే ఆధారపడుతోంది. వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా ఇన్నాళ్లుగా వ్యవహరిస్తున్న ఆమె తాజాగా అదే బాటలో మరో వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో ఆమె భేటీ అయ్యారు. తనకు అన్యాయం జరగిందని, అవమాన పర్చారని సంచైత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మాన్సాస్ ట్రస్టులో లింగ వివక్షపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేసిన నేపథ్యంలో సంచైత ఆమెతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా : వాసిరెడ్డి పద్మ
మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచైత గజపతిరాజుపై అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ ఫైరయ్యారు. మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్ష అనాగరికమన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ప్రశ్నించారు. సంచైత విషయంలో అశోక్ మాటలు ఇంకా రాచరిక వ్యవస్థను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. సంచైత మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తన నియామకంతో పాటు వారసత్వ అంశాన్ని కించపరిచే రీతిలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు.
జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ
అశోక్ గజపతిరాజు మాన్సాస్ ఛైర్మన్ పదవిని తిరిగి చేపట్టడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. మాన్సాస్ ట్రస్ట్లో అక్రమాలు జరిగాయంటూ తెరపైకి తెచ్చి ఆయన్ను తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అవన్నీ విఫలమైనా లింగ వివక్ష అస్త్రాన్ని ఆయనపై సంధించేందుకు సిద్దమవుతోంది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సాయంతో ఈ వ్యూహాన్ని అమల్లో పెట్టనున్న వైసీపీ సర్కార్ సంచైతను పిలిపించి ఆమెకు అన్ని విషయాలు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్గా లింగ వివక్ష అస్త్రంతో అశోక్ గజపతిరాజును పదవీ వీచ్యుతుడిని చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.











