ప్రభుత్వం ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం ఎందరికి మేలు చేయనుందో ఏమో కానీ, అప్పుడే ఈ పట్టా పంపిణీలో కోణాలు వెలుగు చూస్తున్నాయి. పట్టా ఇప్పిస్తాం అంటూ కొన్ని చోట్ల వైకాపా నాయకులు మోసాలకు పాల్పడుతుందే.. మరికొన్న చోట్ట వైకాపా నాయకులు ఉద్దేశపూర్వకంగా పేర్లను తొలగించారంటూ ప్రజలు వాపోతున్నారు. అనంతపురంలో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. పట్టాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం సృష్టిచింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం గార్లదిన్నె మండల కేంద్రంలో ఇళ్ళ స్థలాల జాబితాల ప్రకారం ఇళ్ల పట్టాల పంపణీ జరగాల్సి ఉంది. అందరూ తమ పేర్లను పరిశీలించుకుంటున్న సందర్భంలో, మల్లయ్య అనే వ్యక్తి తన పేరు జాబితాలో లేదని తెలుసుకుని మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకుంటానంటూ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కడంతో స్థానికులంతా అక్కడకు చేరి అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసులకు సమాచారం అందడంతో వారు కూడా అక్కడకు చేరుకుని అతనికి సమాధానపరచడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ మల్లయ్య మాత్రం వారి మాటలను వినడం లేదు. తన పేరును కవాలనే స్థానిక వైకాపా నాయకులు తొలగించారని, తనకు అన్ని అర్హతలు ఉన్నా కూడా కక్ష సాధిస్తున్నారని పోలీసుల ముందే వాపోయాడు. మరి పోలీసుల ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి!
Must Read ;- వైకాపా నాయకుడిపై కేసు పెట్టిన మహిళ