ఇప్పటి జెనరేషన్ ను బట్టి.. సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సీనియర్ హీరోలు సైతం సీనియర్ డైరెక్టర్స్ ను వదిలిపెట్టి.. యంగ్ డైరెక్టర్స్ బాట పడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ సైతం ఇప్పటి దర్శకులతోనే ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి బాలయ్య కూడా చేరిపోయారు. ప్రస్తుతం బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్న బాలకృష్ణ.. తదుపరి చిత్రాల కోసం యువదర్శకుల్ని లైన్ లో పెట్టారు.
అఖండ తర్వాత బాలయ్య చేయబోయే సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్లియర్ గా రవితేజ తో ‘క్రాక్’ సినిమా తీసి.. బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న గోపీచంద్ .. పల్నాడు బ్యాక్ డ్రాప్ లో ఓ పవర్ ఫుల్ స్టోరీని రాసుకున్నాడు. ఆ కథకి బాలకృష్ణ బాగా ఇంప్రెస్ అవడంతో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళేందుకు సిద్ధమవుతోంది.
ఇక దీని తర్వాత బాలయ్య .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అనిల్ ఇంతకు ముందు బాలయ్యతో రామారావు గారు అనే స్ర్కిప్ట్ రాసుకొని బాలకృష్ణ డేట్స్ కోసం వెయిట్ చేశాడు. కానీ అప్పట్లో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మరో ఫ్రెష్ స్టోరీతో బాలయ్యను డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ మేరకు బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తన కథతో, తన నిర్మాణంలోనే తీసిన గాలిసంపత్ రిజల్ట్ తేడా కొట్టడంతో.. ఇప్పడు ఆ నిర్మాతలతోనే బాలయ్య సినిమాను చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎఫ్ 3 కంప్లీట్ కాగానే.. అనిల్ బాలయ్య స్ర్కిప్ట్ మీద కూర్చుంటాడట. మరి ఈ అవకాశాన్ని అనిల్ రావిపూడి ఏ రేంజ్ లో సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
Must Read ;- బాలయ్య సరసన భాగ్యలక్ష్మినే ఖాయం చేశారట!