మేడమ్ సార్.. మేడమ్ అంతే అనేలా పని చేసిన అధికారిణిని అందలం ఎక్కించబోతున్నారు. రూల్స్ అన్నీ బ్రేక్ చేసి.. జగన్ సాబ్ ఏం చెబితే అది చేసి.. ఆఖరికి కోర్టులను, కోర్టుల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పని చేసిన మేడమ్కు అందుకు తగ్గ ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. ఎవరి ఆదేశాలు లెక్క చేయలేదో.. ఆ ప్లేస్లోకి వెళ్లబోతుంది మేడమ్. అవును.. కేంద్ర సర్వీసుల్లో ఉండి.. ఢిల్లీ అయినా కూడా.. పనిమాలా పిలిపించుకుని చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మేడమ్ వైఎస్ హయాంలో వినయ విధేయలతలతో పనులు చేసిపెట్టారని చెబుతుంటారు.
జగన్ మనసెరిగి..
ఒకవైపు ప్రవీణ్ ప్రకాష్ రాజ్యాంగేతర శక్తిగా అవతరించి బీభత్సంగా చేస్తున్నా.. నీలం సాహ్నీ సర్దుకుపోయారు. సర్దుకుపోవడమే కాదు.. జగన్ మనసెరిగి ప్రవర్తించారు. ప్రవీణ్ ప్రకాష్ ఏం చెబితే అదే చేసుకుంటూ పోయారు. హైకోర్టు ఆదేశాలొచ్చి ధర్మసంకటం ఎదురైనా సరే.. ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అధినేత జగన్, సారథి ప్రవీణ్ ప్రకాష్ ఏం చెబితే అది చేసుకుపోయారు. అందుకే రెండుసార్లు మేడమ్ పదవీ కాలం ముగిసినా.. కేంద్రంలో లాబీయింగ్ చేసి మరీ పొడిగించుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో..
అన్ని గడువులు అయిపోయాక.. అన్ని ఆప్షన్లు వాడేశాక.. చివరకు చీఫ్ అడ్వయిజర్ పదవి కూడా ఇచ్చి.. మరీ ఉంచుకున్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో కూర్చోబెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే జరిగితే.. ఇక తెలుగుదేశం లేఖలు రాయడం, కంప్లయింట్లు చేయడం లాంటివి మానేసి కామ్గా కూర్చోవడం మంచిది. ఎందుకంటే నిమ్మగడ్డే అట్టట్టా స్పందిస్తే.. ఇక మేడమ్ అయితే ఆ ఆశలే పెట్టుకోనక్కర్లేదు.. అవసరం అయితే రివర్స్లో వచ్చినా వస్తారు సాహ్నీ మేడమ్. నిమ్మగడ్డతో మంచి అనుభవం సంపాదించిన వైసీపీ సర్కార్.. ఇక ఏ పదవిలో అయినా సరే.. చెప్పింది విని ఊకొట్టి పని చేసేవాళ్లను పెట్టుకుంటోంది. నీలంసాహ్ని నియామకం కూడా అంతే మరి.
సుప్రీంకోర్టు గోవా కేసులో ఇలా..
విచిత్రం ఏంటంటే నిమ్మగడ్డను తీసేయటం కోసం పెద్ద బిల్డప్ ఇచ్చి రిటైర్డ్ జడ్జిలను పెట్టుకోవాలని ఆర్డినెన్స్ ఇచ్చి మరీ కనగరాజ్ను తెచ్చి సింహాసనంపై కూర్చోబెట్టారు. గవర్నర్ కూడా ఊ కొట్టారు. తర్వాత సుప్రీంకోర్టుదాకా వెళ్లాక గాని ఆ ఆర్డినెన్స్ కేన్సిల్ కాలేదు. ఇప్పుడు ఆ బిల్డప్ను పక్కన పెట్టేసి వెళ్లాలనుకుంటోంది. ఇటీవలే సుప్రీంకోర్టు గోవా కేసులో ప్రభుత్వంలో పని చేసిన అధికారులను ఎన్నికల కమిషనర్గా పెట్టకూడదని వ్యాఖ్యానించింది. మరి దాని ప్రకారం అయితే ఇది జరగడం కష్టమే.. కాని పైన మనోళ్లు ఉన్నారు కాబట్టి.. అయిపోయినా అయిపోవచ్చు.
Must Read ;- తాత ఆవేశమే గాని తండ్రి ఆలోచన లేదా.. జగన్ తీరుపై విశ్లేషణలు










