టీడీపీ సీనియర్ నేత,ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు)చిన్న కుమారుడు రవీంధ్రనాథ్ చౌదరి (32) అనుమానాస్పదంగా మృతి చెందారు.గత కొంత కాలంగా రవీంధ్రనాథ్ చౌదరికి తాగుడు మాన్పించేందుకు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.సోమవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి తప్పించుకుని రవీంధ్రనాథ్ చౌదరి హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో రూమ్ తీసుకున్నారు.మంగళవారం సాయంత్రం 4 గంటలకు గది ఖాళీ చేయాల్సి ఉంది.అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఖాళీ చేయకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి తలుపు తట్టారు.తలుపు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది వద్ద ఉన్న మారు తాళాలతో తలుపులు తెరిచి పరిశీలించారు.హోటల్ గదిలోని బాత్ రూంలో నోటి వెంట రక్తం కక్కుకుని రవీంధ్రనాథ్ చౌదరి చనిపోయి ఉండటాన్ని సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.రవీంధ్రనాథ్ తండ్రి మాగంటి బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాగంటి ఇంట్లో రెండో విషాదం
నాలుగు నెలల కిందటే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో చనిపోయారు.ఇంతలోనే మాగంటి బాబు రెండో కుమారుడు కూడా చనిపోవడంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.మాగంటి బాబు చిన్న కుమారుడు ఆకస్మిక మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు,టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Must Read ;- మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత : చంద్రబాబు సంతాపం