టాలీవుడ్ లో ఉన్న మంచి దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. ప్రభాస్ నటించిన ‘మున్నా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు వంశీ. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా దర్శకుడిగా మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తో తీసిన ‘బృందావనం’ సినిమాతో చక్కటి విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత ‘ఎవడు’, ‘ఊపిరి’ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. వంశీ ప్రతిభను గుర్తించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాకు అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రం ఎన్ని సరికొత్త రికార్డులను సృష్టించిందో తెలిసిందే.
‘మహర్షి’ సినిమా తర్వాత వంశీ మళ్ళీ మహేష్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. వంశీ ఒక మంచి కథను కూడా రెడీ చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం వంశీ ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడని టాక్. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు సంబంధించిన ఓటీటీ సంస్థ అయిన ‘ఆహా’ కోసం ఒక వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నాడు వంశీ.
ఇప్పటికే వెబ్ సిరీస్ గురించి అల్లు అరవింద్ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో పాత్రలు, సన్నివేశాలు కొత్తగా ఉంటాయని, ఒక వైవిధ్యమైన అంశంతో, ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని జోనర్ లో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. మరి వంశీ వెబ్ సిరీస్ కోసం ఎటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ఠాగూర్ తో దశతిరిగిపోయిందన్న విలక్షణ నటుడు