స్టార్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో అటు కోలీవుడ్ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా పారిపోయింది. ప్రస్తుతం ఆమె ఒక వారం రోజుల నుండి గోవాలో హాలిడేను గడుపుతోంది. తన స్నేహితులతో రిలాక్స్ అవ్వడానికి గోవా వెళ్ళింది. హాలిడేకు దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇప్పుడు హాలిడేను ముగించుకొని హైదరాబాద్ తిరిగి ప్రయాణం అయ్యింది ఆమె.
దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ లో ఆమె ఒక విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఉంది. మాస్క్, ఫేస్ షీల్డ్ ధరించిఉన్న ఫొటోస్ ను షేర్ చేసిన అమలా పాల్ వాటి క్రింద మంచి మెస్సేజ్ కూడా పోస్ట్ చేసింది. ‘వెళ్లి మీ కొత్త జ్ఞాపకాలను రెడీ చేసుకోండి.. వెళ్లి మీ పాత స్నేహితులను కలవండి.. వెళ్లి మీరు మరిచిపోయిన శత్రువులకు క్షమాపణ చెప్పండి… వెళ్లి మీ జీవితంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తికి కృతఙ్ఞతలు తెలపండి… వెళ్లి మిమ్మల్ని మీరు కనుక్కోండి… వెళ్ళండి… వెళ్తూనే ఉండండి. ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత పని చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అంటూ పోస్ట్ చేసింది అమలా పాల్.
ఇప్పుడు ఈ పోస్ట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆమె అభిమానులు. తన జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మరిచిపోయి లైఫ్ ను సంతోషంగా గడపాలని వారు కోరుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తోంది. అందుకు సంబంధించిన షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తుందా లేక తెలుగులో ఏమైనా కొత్త ప్రాజెక్ట్ కోసం వస్తుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Must Read ;- కాబోయే జంట నిహారిక, చైతన్య డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్.